Tuesday, June 24, 2025

కాలు మీద కాలు వేసుకొని ఇలా కూర్చోవడం ఎంత హానికరమో తెలుసా?

నేటి కాలంలో చాలా మంది ఏదో ఒక అనారోగ్యంతో బాధపడుతున్నారు. అయితే ఈ బాధలకు కారణం వాతావరణ కాలుష్యం ఒక కారణమైతే.. మనుషులకు ఉండే అలవాట్లు మరొక కారణంగా ఉంటాయి. ఈ మధ్య కాలంలో మహిళలకు ఎక్కువగా వెన్నునొప్పి లేదా రెస్ట్ ఆఫ్ లెగ్(RSL)సమస్యతో బాధపడుతున్నారు. అలాగే గర్భిణీ స్త్రీలల్లో అధిక రక్తపోటు పెరిగిపోతుంది. వీటికి సరిగా కూర్చోకపోవడమే కారణమని Journal Of Midwifery And Women’s Health ఒక నివేదికను బయటపెట్టింది. మహిళలు కూర్చునే విధానంలో పొరపాట్లు చేయడం వల్ల కాళ్ల నొప్పులు, కీళ్లనొప్పులు కూడా కలిగి ఉంటారని తెలిపింది.

ఎక్కువ సేపు నిలబడి ఉండి లేదా.. ఏదైనా పనిచేసినప్పుడు రిలాక్స్ కావడానికి కాసేపు కూర్చుంటారు. కొందరు రిలాక్స్ గా కుర్చీపై వాలిపోతారు. ఈ క్రమంలో కొందరు ఒక కాలుపై మరొక కాలు వేసి కూర్చుంటారు. సాధారణ కూర్చునే వారికంటే ఇలా కాలుపై కాలు వేసుకొని కూర్చోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని Health Line తెలిపింది. కాలుపై కాలు వేసుకొని కూర్చోవడం వల్ల ఆ సమయంలో ఎటువంటి సమస్యలు లేకపోయినా దీర్ఘకాలికంగా హానికరాన్ని కలగ జేస్తుంది.

మగవారి కంటే మహిళ్లలో రక్త ప్రసరణ వేగం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి సమయంలో దేహాన్ని రిలాక్స్ డ్ గా ఉంచడం వల్ల అన్ని భాగాలకు రక్త ప్రసరణ జరుగుతుంది. అలా కాకుండా శరీరాన్ని కండరాలు పట్టే విధంగా కూర్చోవడం గానీ, ఇటువంటి పనులు చేయడం వల్ల గానీ ఎముకలపై ప్రభావం చూపుతుంది. ఈ క్రమంలో బ్లడ్ ప్రషర్ పెరిగి రక్తపోటుకు కూడా దారీ తీయొచ్చు. కొందరిలో రాను రాను వెన్ను నొప్పి కూడా ఉండే సమస్య ఉంది.

జర్నల్ ఆప్ క్లినికల్ నర్సింగ్ లో ప్రచురించబడిన ఒక అధ్యయనంలో మోకాలి స్థాయి వరకు రక్త ప్రసరణ వేగంగా సాగుతుంది. దీంతో మోకాలుపై మరో కాలు భారం వేయడం వల్ల ఇది రక్త ప్రసరణను అడ్డుకుంటుంది. ఇక బీపీ ఎక్కువగా ఉన్న వారు ఇలా కూర్చోవడం వల్ల తొందరగా అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. సిరుల గుండ రక్తం గుండెకు చేరినప్పుడు రక్త ప్రసరణలో అడ్డంకులు ఏర్పడితే సిరుల్లో సమస్య ఏర్పడుతుంది. దీంతో రక్తం గడ్డకట్టే అవకాశం ఉంది. అందువల్ల కాలు మీద కాలు వేసుకొని కూర్చోవడం వల్ల ఇన్ని సమస్యలు వస్తాయి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News