తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా తాజాగా కీలక ఆదేశాలు జారీ అయ్యాయి. పేద ప్రజలకు ఇళ్లు అందించాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా మూడు కేటగిరీలను విభజించింది. ఇందులో మొదటిది సొంతంగా స్థలం ఉన్న వారికి ఇల్లు నిర్మించుకుంటే రూ.5 లక్షల సాయం అందించనున్నారు. రెండోకేటగిరి కింద ఇంటి స్థలం ఇవ్వడంతో పాటు ఇల్లు నిర్మించనున్నారు. మూడో కేటగిరిలో పాత ఇల్లు ఉంటే ఆ స్థానంలో ఇల్లు నిర్మించుకునేందుకు సాయం చేయనున్నారు.
అయితే ఈ పథకంలో భాగంగా ముందుగా సొంతంగా స్థలం ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ పథకానికి ఇప్పటికే దరఖాస్తులు చేసుకోగా లబ్ధిదారులను ఎంపిక చేశారు. వీరిలో కొందరు ఇప్పటికే ఇళ్ల నిర్మాణం మొదలు పెట్టారు. అయితే చాలా మంది తమకున్న స్థలాల్లో పెద్ద ఎత్తున్న ఇళ్ల నిర్మాణం మొదలుపెట్టారు. ఈ మేరకు గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
తాజాగా హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వీపీ. గౌతమ్ కలెక్టర్లకు ఓ లేఖ రాశారు. ఇందులో 400 నుంచి 600 చదరపు అడుగుల లోపు ఇళ్లు నిర్మించుకున్నవారికి మాత్రమే బిల్లులు చెల్లించాలని తెలిపారు. 600 చదరపు అడుగులు దాటితే ఈ పథకానికి అనర్హులని, వారికి మాత్రమే రూ. లక్షలు అందించాలని కలెక్టర్లకు తెలిపారు. ఈ స్థలం దాటితే బీపీఎల్ కిందకు రారని, ఈ విషయం కేంద్ర ప్రభుత్వ సాయంలో కూడా ఉందని పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే నిర్మించుకున్న ఇళ్లను మరోసారి పరిశీలించాలని, ప్రభుత్వ విధించిన నిబంధన ప్రకారం మాత్రమే బిల్లులు చెల్లించాలని అన్నారు.
ఇదిలా ఉండగా అర్హులైన వారికి ఏప్రిల్ 28 నుంచి బిల్లులు చెల్లించనున్నారు. లబ్ధిదారులకు నేరుగా బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ కానున్నట్లు తెలిపారు. భూ భారతి చట్టానికి ప్రాధాన్యం ఇస్తూ దీనిని పకడ్బందీగా అమలు చేయాలని సూచించారు.