తెలుగు క్యాలెండర్ ప్రకారం ఉగాది నుంచి కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా కొత్త పంచాంగం కూడా ఇప్పటినుంచే మొదలవుతుంది. కొత్త పంచాంగం ప్రకారం శుభ ముహూర్తాలు, మంచి రోజులు, వివాహాది శుభకార్యాలను నిర్ణయిస్తారు. అందువల్ల ఉగాది రోజున సాయంత్రం పంచాంగ శ్రవణం చేస్తారు. తమ జాతకం కొత్త సంవత్సరంలో ఎలా ఉందో తెలుసుకోవాలని అనుకుంటారు. 2025 మార్చి 30న ఉగాది సందర్భంగా కొత్త ఏడాది ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా ఆయా రాశుల వారి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం…
కొత్త పంచాంగం ప్రకారం వృషభ రాశి వారికి ఆదాయం 11.. వ్యయం 5 ఉండనుంది ఈ రాశి వారికి ఈ ఏడాది మొత్తం ఆదాయానికి తిరుగు ఉండదు. ఉద్యోగులు ఉల్లాసంగా ఉంటారు. పెండింగ్లో ఉన్న డబ్బు అసలు అవుతుంది. వ్యాపారులకు లాభాల పంట పండుతుంది.
‘విశ్వావసు’ అంటే ఏమిటీ? ఈ పేరుకు ఎలాంటి చరిత్ర ఉంది? – insightearth.in – Telugu News Portal
మిథున రాశి వారికి ఈ ఏడాది ఆదాయం 8.. వ్యయం 2 ఉన్నందున ఆదాయం ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. గతంలో పెట్టిన పెట్టుబడుల వల్ల లాభాలు అధికంగా వస్తాయి. ఉద్యోగులకు అదనపు ఆదాయం సమకూరుతుంది. పూర్వీకుల ఆస్తి నుంచి శుభవార్తలు వింటారు.
కన్యా రాశి వారికి ఈ ఏడాది ఆదాయం 14.. వ్యయం 2గా ఉంది. దీంతో ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కొన్ని పనుల కోసం ఆదాయం సమకూరుతుంది. పెండింగ్లో ఉన్న ఆర్థిక సమస్యలను పరిష్కరించుకుంటారు. వివిధ మార్గాల నుంచి అనుకోకుండా ఆదాయం వస్తుంది. ఉద్యోగులకు జీతాలు పెరుగుతాయి. వ్యాపారులకు ఆదాయం రావడంతో ఉల్లాసంగా ఉంటారు.
విశ్వావసు సంవత్సరం.. ఈ రంగాల వారికి అనుకూలం.. – insightearth.in – Telugu News Portal
తులా రాశి వారికి ఏడాది ఆదాయం 11.. వ్యయం 5 ఉన్నందున అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుంది. ధన ప్రాప్తికి అవకాశం ఎక్కువగా ఉంది. ఇతరుల నుంచి సొమ్మును ఎక్కువగా రాబట్టుకుంటారు. ఆస్తుల ద్వారా ఆదాయం పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలు చేసే వారికి లాభాలు వస్తాయి. వ్యాపారులు భాగస్వాముల మధ్య సంబంధాలు మెరుగుపడతాయి.
[…] Ugadi 2025: కొత్త పంచాంగం ప్రకారం.. ఈ రాశుల వా… […]