ప్రపంచమంతా సునీత విలియమ్స్ కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసింది. అంతరిక్షం నుంచి బయలుదేరిన సునీత భారత కాలమాన ప్రకారం బుధవారం ఉదయం 3.26 ప్రాంతంలో పసిపిక్ సముద్రంలో దిగారు. ఈ సందర్భంగా ప్రపంచ దేశాలతో పాటు భారత్ ఆమెకు గ్రాండ్ వెల్కమ్ తెలిపింది. అయితే సునీతా విలియమ్స్ భారత సంతతికి చెందిన మహిళ. ఆమె కుటుంబ సభ్యులు ఎవరు? అని చాలామందికి తెలుసుకోవాలని ఆసక్తి ఉంది. అంతే కాకుండా ఆమె భర్త గురించి ఆసక్తికర విషయాలు.. ఆ వివరాలు కి వెళ్తే..
భారతదేశంలోని గుజరాత్ కు చెందిన దీపక్ పాండ్యా అమెరికాలోని ఓ యాహో రాష్ట్రంలో సెటిలయ్యారు. ఈయన స్లో వేకియా దేశానికి చెందిన బోనీ జలోకర్ అనే మహిళను వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు సంతానం. వీరిలో సునీత చివరి మహిళ. అమెరికాలోని నవల అకాడమీలో ఫిజిక్స్ డిగ్రీ, నోరిడా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ చేసిన సునీత విలియమ్స్ తండ్రి సూచనతో నౌకా దళంలో బేసిక్ డ్రైవింగ్ ఆఫీసర్గా చేరారు. హెలికాప్టర్ కం బర్డ్స్ సపోర్టు స్క్వాడ్రన్ త్రీ నేతృత్వంలో యుద్ధ విమానాలు నడపడంలో శిక్షణ తీసుకుంది. అలా 30 సంవత్సరాలు వివిధ ఎయిర్ క్రాఫ్ట్ లపై అనుభవం సాధించింది.

ఆ తర్వాత ఆమెను నాసా వ్యోమగామిగా ఎంపిక చేసింది. 1988లో అంతరిక్ష యానంలో శిక్షణ తీసుకున్న సునీత అంతరిక్షానికి చేరిన రెండో మహిళగా గుర్తింపు పొందారు. అంతరిక్షంలోకి వెళ్లిన తొలి మహిళ భారత్ కు చెందిన కల్పనా చావ్లా కావడం విశేషం. మొట్టమొదటిసారిగా సునీత విలియమ్స్ 2006 డిసెంబర్ నుంచి 2007 జూన్ వరకు అంతరిక్షంలో పర్యటించారు. ఆ తర్వాత 2012లో 4 నెలల పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోని ఉండిపోయారు. తాజాగా 2024 జూన్ 5న 8 రోజుల వ్యవధి కోసం అంతరిక్షానికి వెళ్లిన ఆమె 9 నెలల పాటు అక్కడే ఉండిపోయారు. అయితే సునీత రాకతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
అయితే అందరూ ఆసక్తిగా ఆమె కుటుంబ సభ్యుల గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారు. సునీతా భర్త పేరు మైఖెల్ జె. విలియమ్స్. వీరిది ప్రేమ వివాహం. మైఖెల్ జె విలియమ్స్ ఒక ఫెడరల్ మార్షల్. దీని గురించి చాలా తక్కువ మందికే తెలిసి ఉంటుంది. మైఖెల్ పనిచేసే మార్షల్స్ సర్వీస్ లో పనిచేస్తూ హెలిక్యాప్టర్ ఫైల్ గా ఉన్నారు. ఈ సమయంలో సునీతను కలుసుకున్నారు. సునీతా నాసాలో చేరక ముందు యుద్ధ విమానాలు నడిపింది. ఈ సమయంలోనే మైఖెల్ పరిచయం అయి ప్రేమించుకున్నారు. ఆ తరువాత వీరు రెండు దశాబ్దాల కిందట కొద్ది మంది సమక్షంలోనే వివాహం చేసుకున్నారు.

మైఖెల్ హిందు మతాన్ని ఎక్కువగా ఫాలో అవుతారు. 2006 డిసెంబర్ లో సునీత భగవద్గీత కాపీను తన భర్తకు ఇవ్వడంతో ఆయన ఎంతో సంతోషించాడు. 2007లో ఆమె పూర్వీకుల గ్రామమైన ఝులసన్ ను భర్తతో కలిసి సందర్శించారు. అయితే సునీతా భర్త ఎక్కువగా మీడియాలో కనిపించరు. అందుకే ఆయన ఫొటోలు కూడా అరుదుగా కనిపిస్తూ ఉంటాయి.