భారతదేశ ఉపరితలానికి ఉన్న అందమైన దేశం నేపాల్. 26 మిలియన్లకు పైగా జనాభా ఉన్న ఈ చిన్న దేశం ఎంతో సౌందర్యాన్ని కలిగి ఉంటుంది. మంచుతో కప్పబడిన హిమాలయాలతో పాటు ఉష్ణ మండల అడవులు ప్రజలకు, పర్యాటకులకు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. అంతేకాకుండా ఇక్కడ బుద్ధుడి జన్మస్థలమైన లుంబిని, స్వయంభునాథ్, మంకీ టెంపుల్ వంటివి ఉన్నాయి. దీంతో చాలామంది నేపాల్ కి వెళ్లి చూడాలని అనుకుంటారు. అయితే నేపాల్ లో చూడదగిన అత్యంత ప్రతిష్టాత్మక ప్రదేశాలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం..
ముక్తినాథ్ టెంపుల్ :

నేపాల్ లో హిందువులు మరియు బౌద్ధవులు ఎక్కువగా ఉంటారు. వీరు ప్రార్థించే ఆలయంలో ముక్తినాథ్ టెంపుల్ ఒకటి. ఇది ముస్తాన్ జిల్లాలోని ముక్తినాథ్ టూర్ ప్యాకేజీ లోయలో 3,710 మీటర్ల అడుగుల ఎత్తులో ఉంది. వైష్ణవులకు 108 దివ్య దేశాలలో పవిత్ర స్థలాలలో ఒకటిగా దీనిని భావిస్తారు. ముక్తినాథ్ టెంపుల్ ను సందర్శించడం వల్ల మరణ గండం నుంచి విముక్తి పొందుతారని భావిస్తారు.
పశుపతినాథ్ టెంపుల్:

నేపాల్ లో ఉండే అద్భుత ఆలయం పశుపతినాథ్ టెంపుల్. ఇది నేపాల్ లోని అత్యంత పవిత్ర దేవాలయాలలో ఒకటి. నేపాల్ రాజధాని అయిన ఖట్మాండ్ లోని భాగమతి నది ఒడ్డున కొలువై ఉంది. ఈ ఆలయం యునెస్కో ప్రపంచ వారసత్వంగా గుర్తింపు పొందింది. ఇందులో ఐదవ శతాబ్దానికి చెందిన పశుపతినాథ్ విగ్రహం ఉంది. పశుపతినాథ్ ను సందర్శించడం వల్ల మంచి ఆరోగ్యం తో పాటు జీవితంలో అన్ని పనులు విజయవంతంగా పూర్తి అవుతాయని నమ్ముతారు.
బౌద్ధనాథ్ స్తూపం:

నేపాల్ రాజధాని ఖాట్మాండ్ నడిబొడ్డున బౌద్ధనాథ్ స్తూపం ఉంది. ఇది పవిత్ర బౌద్ధ ప్రదేశాలలో ఒకటి. ఐదవ శతాబ్దానికి చెందిన దీని చుట్టూ టిబెటిన్ మఠాలు కనిపిస్తాయి. ఈ స్థూపం చుట్టూ ప్రదక్షిణాలు చేయవచ్చు.
స్వయంభునాథ్ స్తూపం:

నేపాల్ లోని ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలలో స్వయంభునాథ్ స్తూపం ఒకటి. దీనినే మంకీ టెంపుల్ అని కూడా పిలుస్తారు.ఖాట్మండు లోయ వద్ద ఉన్న కొండపైన ఇది ఉంది. దీనిని కూడా ఐదవ శతాబ్దంలో నిర్మించాలని చరిత్ర తెలుపుతుంది.
ఫెవా సరస్సు:

ఇక్కడున్న మరో అందమైన ప్రదేశం ఫెవా సరస్సు. ఇది మధ్య నేపాల్ లోని ఫొకారా నగరంలో ఉంది. ఇది నేపాల్ దేశంలోనే రెండో అతిపెద్ద సరస్సు. దీనికి మెలంచి నది నుంచి నీరు వస్తుంది.
సారంగ్ కోట్:

నేపాల్ లో ఉన్న మరో సుందర దృశ్యం సారంగ్ కోట్. సూర్యోదయం సమయంలో లేదా సూర్యస్తమం సమయంలో సారంగ్ కోట్ పైకి ఎక్కి చూడడం వల్ల అద్భుతమైన దృశ్యం కనిపిస్తుంది.. ఇక్కడ నేపాలి సంస్కృతి ఎక్కువగా కనిపిస్తుంది.
భక్తపూర్ దర్బార్ స్క్వేర్:

ఈ దేశంలో ఉన్న మరో ప్రదేశం భక్తపూర్ దర్బార్ స్క్వేర్. చతురస్త్ర ఆకారం కలిగిన నేపాల్ లోని దేవాలయాల్లో ఇది కూడా ఒకటి. దీనిని పూర్వం రాజభవన నిలయంగా పేర్కొంటారు. 15వ శతాబ్దంలో దీనిని మల్ల రాజులు నిర్మించినట్లు చెబుతారు.
పూన్ హిల్:

నేపాల్ లోని ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలలో పూన్ హిల్ ఒకటి. అన్నపూర్ణ ప్రాంతంలో ఉన్న పూన్ హిల్ హిమాలయాల దృశ్యాలను కనువిందు చేస్తుంది. ట్రెక్కింగ్ చేయాలనుకునేవారు ఇది అనుకూలంగా ఉంటుంది.
ఎవరెస్టు శిఖరం:

నేపాల్ లో ఉన్న అత్యంత ఎత్తైన పర్వతం ఎవరెస్టు శిఖరం. దీని గురించి ఇప్పటికే చదువుకొని ఉంటారు. ఇది ఎనిమిది వేల మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో ఉంది. నేపాల్ దేశం మొత్తంలో 240 కంటే ఎక్కువగా పర్వతాలు ఉన్నాయి. ఎవరెస్టు పర్వతం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతంగా పేర్కొంటారు.