Thursday, June 26, 2025

అప్పుడు బండి సంజయ్.. ఇప్పుడు కొండా సురేఖ.. మానవత్వం చాటుకుంటున్న మంత్రులు..

అధికారంలో ఉండే కొందరు నాయకులను కలవాలంటే ప్రత్యేకమైన సమయం తీసుకోవాలి. వారు ఏదైనా కార్యక్రమానికి వచ్చినప్పుడో? లేదా ఇతర సమయాల్లో మాత్రమే కలుసుకోవడానికి వీలుంటుంది. కానీ కొందరు నాయకులు ప్రజల వద్దకే పాలన అన్నట్లుగా.. ప్రజలకు ఏ చిన్నకష్టం వచ్చినా వెంటనే వాలిపోతారు. అలాగే వారు ప్రయాణం చేసే దారిలో ఏదైనా సమస్య వస్తే వెంటనే బాధితుల పక్షాన నిలిచిపోతున్నారు. మొన్న కేంద్ర మంత్రి బండి సంజయ్…. ఇప్పుడు రాష్ట్ర మంత్రి కొండా సురేఖ కొన్ని సంఘటనలను చూసి చలించిపోయారు. వెంటనే ఆపదలో ఉన్న వారికి సాయం చేసి ప్రశంసలు పొందుతున్నారు..వివరాల్లోకి వెళితే..

2024 నవంబర్ 11..
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలంలోని సింగాపూర్ వద్ద.. మానకొండూర్ మండలం కెల్లెడ గ్రామానికి చెందిన దివ్య శ్రీ అనే మహిళ తన భర్త, పిల్లలతో కలిసి హుజూరాబాద్ నుంచి మానకొండూర్ వైపు బైక్ పై వెళ్తున్నారు. ఈ క్రమంలో తమ వాహనం అదుపు తప్పడంతో కింద పడిపోయారు. అయితే అదే సమయంలో అక్కడికి వచ్చిన లారీ మధ్యలో దివ్య శ్రీ ఇరుక్కుపోయింది. ]

తన జుట్టు లారీ కింద ఉండిపోయింది. దీంతో వీరు కేకలు వేయగా.. అటువైపు వచ్చిన కేంద్ర హోం శాఖ సహాయమంత్రి బండి సంజయ్ వెంటనే స్పందించారు. తన కాన్వాయ్ దిగి ఆ మహిళకు సాయం చేశారు. తన జుట్టుకత్తిరించి ఆమెను లారి కింది నుంచి తీసేందుకే సాయం చేశారు. అలాగే ఆమెను ఆసుపత్రికి పంపించి తన ఖర్చులు మొత్తం భరిస్తానని హామీ ఇచ్చారు.

2024 నవంబర్ 26..
పెద్దపల్లి జిల్లా లోని సబ్బితం గ్రామానికి వెళ్తున్న రాష్ట్ర అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ.. బీహార్ కు చెందిన ఓ ఓ కుటుంబం రోడ్డుపై నడుకుంటూ వెళ్తుండగా గమనించింది. ఈకుటుంబంలోని చిన్నారికి చెప్పులు లేవు. దీంతో ఆమెను చూసిన మంత్రి చలించిపోయారు. వెంటనే కారు దిగిన ఆ అమ్మాయికి

చెప్పులు కొనిచ్చారు. ఆ పాప వేసుకున్న డ్రెస్సు చిరిగిపోవడంతో కొత్త డ్రెస్ కొనిచ్చారు. ఆ తరువాత తల్లిదండ్రులకు అప్పగిస్తూ పిల్లలకు ఎలాంటి కష్టం కలిగించొద్దు.. అని చెప్పారు. అయితే మంత్రి చేసిన ఈ పనికి అందరూ మెచ్చుకుంటున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News