పారిస్ లో ఒలంపిక్స్ ముగిసిన తరువాత పారాలింపిక్స్ 2024 ఆగస్టు 28 ప్రారంభమయ్యాయి. ఇవి సెప్టెంబర్ 8తో ముగిశాయి. ప్రాన్స్ ఆథిత్యం ఇచ్చిన ఈ ఈవెంట్స్ లో ప్రపంచం నుంచి 168 దేశాలు పాల్గొన్నాయి. ఇందులో మొత్తం 4,400 మంది అథ్లెట్స్ పాల్గొన్నారు. మొత్తం 549 గేమ్స్ ఉంటాయి. భారత్ నుంచి 84 మంది పారాలింపిక్స్ లో పాల్గొన్నారు. మొత్తం క్రీడల్లో భారత్ 29 పతకాలను గెలుచుకుంది. ఇదే పారిస్ ఒలంపిక్స్ లో భారత్ 110 క్రీడాకారులు పాల్గొని 6 పతకాలు సాధించారు. అయితే ఒలంపిక్స్ లో కంటే పారాలింపిక్స్ లో పతకాలు ఎందుకు ఎక్కువ వచ్చాయి? అసలు కారణమేంటి?
పారాలింపిక్స్ గేమ్స్ లో వైకల్యం ఉన్న వారి మధ్య క్రీడా పోటీలు నిర్వహిస్తారు. వీరు తమ వైకల్యాన్ని చూడకుండా మనోధైర్యంతో క్రీడల్లో పాల్గొనే అవకాశాన్ని ఇస్తారు. ప్రతీ రెండేళ్లకోసారి ఒలంపిక్స్ క్రీడలు పూర్తయిన తరువాత పారాలింపిక్స్ ప్రారంభం అవుతాయి. అయితే దీనికి ముందు జరిగే క్రీడలను ఒలంపిక్స్ అంటే వీటిని పారాలింపిక్స్ అని అంటారు.అంటే ఇవి సమాంతర ఆటలు అని వివరిస్తాయని కొందరు అంటారు. అయితే పారిస్ లో సమ్మర్ ఒలంపిక్స్ కంటే ఇప్పుడు జరిగిన పారాలింపిక్స్ లో భారత్ మాత్రమే కాకుండా చాలా దేశాలు ఎక్కువ పతకాలు సాధించాయి. అందుకు కారణాలు ఉన్నాయి.
సాధారణ ఒలంపిక్స్ క్రీడలు శక్తి సామర్థ్యాలను బట్టి సాగుతాయి. జావెలిన్ త్రో నుంచి బాక్సింగ్, రెజ్లింగ్, బ్యాడ్మింటన్.. ఇలా ఏదీ చూసినా శరీరంలోని ఏదో ఒక అవయాన్ని ఉపయోగించి ఇందులో పాల్గొనాల్సి ఉంటుంది. అయితే కొన్ని దేశాలు సంవత్సరాల తరబడి వీరికి శిక్షణ ఇస్తాయి. ఈ క్రమంలో వారు తీసుకునే ఆహారం కూడా భిన్నంగా ఉంటుంది. దీంతో కొన్ని దేశాలు ఎక్కువగా పతకాలు సాధించాయి. అయినా పారాలింపిక్స్ కంటే ఇవి తక్కువే.
పారాలింక్స్ లో 32 స్పోర్ట్స్ కేగిరీల్లో 329 గోల్డ్ మెడల్స్ కోసం 204 టీంలు పోటీ పడ్డాయి. అయితే పారాలింపిక్స్ లో 22 కేటగిరీల్లో 549 బంగారు పతకాల కోసం 170 టీంలు పోటీ పడ్డాయి. ఈ లెక్కన ఒలంపిక్స్ లో కంటే పారాలింక్స్ లో పోటీ తక్కువ పతకాలు ఎక్కువగా ఉంటాయి. ఉదాహరణకు చైనా పారిస్ ఒలంపిక్స్ లో 40 గోల్డ్, 27 సిల్వర్ 24 కాంస్య పతకాలు గెలుచుకుంది. అదే పారాలింపిక్స్ లో 94 గోల్డ్, 76 సిల్వర్, 50 కాంస్య పతకాలు గెలుచుకుసంది. బ్రిటన్ పారాలింపిక్స్ లో 49 గోల్డ్, 44 సిల్వర్, 31 కాంస్య పతకాలు గెలుచుకుంటే.. పారిస్ ఒలంపిక్స్ లో మాత్రం 14 గోల్డ్, 22 సిల్వర్ , 29 కాంస్య పతకాలు గెలుచుకున్నాయి.
పారాలింపిక్స్ లో భారత్ మాత్రమే కాదు ఇతర దేశాలు సమ్మర్ ఒలంపిక్స్ కంటే ఎక్కువ పతకాలు సాధించాయని తెలుస్తోంది. పారిస్ ఒలంపిక్స్ కేవలం శక్తి సామర్థ్యాలతో ప్రదర్శించగా.. పారాలింపిక్స్ మాత్రం ధైర్య సాహసాలతో పాల్గొంటారు. ఈ క్రమంలో ఆసియా దేశాల్లోని చైనా, భారత్ పారిస్ ఒలంపిక్స్ కంటే పారాలింపిక్స్ లో ఎక్కువ పథకాలు సాధించగలిగింది. అయితే వికలాంగులకు మరింతగా ప్రోత్సాహం అందించి వారికి సరైన వైద్య సదుపాయాలు అందించడం వల్ల పారాలింపిక్స్ లో భారత్ అద్భుతమైన పతకాలు సాధించడానికి అవకాశం ఉంటుందని అంటున్నారు.