ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల బ్రూనే దేశంలో పర్యటించారు. భారత్, బ్రూనె దేశాల మధ్య సత్సంబంధాలు ప్రారంభమై 40 సంవత్సరాలు గడిచినందున ఆయన ఈ సందర్భంగా పర్యటించి మరింత మెరుగైన సంబంధాలు నెలకొనేలా చూడాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా బ్రూనెలో ఉన్న భారతీయులు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఘన స్వాగతం పలికారు. ఇక్కడున్న బ్రూనే యువరాజు హస్సనల్ బోల్కివయా మోదీని ఆహ్వానించడానికి స్వయంగా ఎయిర్ పోర్టుకు వచ్చారు. ఆ దేశ సుల్తాన్ ఇస్తాన్ నూరుల్ ఇమాన్ ప్రత్యేక విందును ఏర్పాటు చేసి పలు చర్చలు జరిపారు. ఈ సందర్భంగా మోదీకి పలు రకాల బ్రూనె దేశాల వంటకాలను రుచి చూపించారు. ఈ సందర్భంగా భారత్, బ్రూనే దేశాల మధ్య సంబంధాలు ఎలా ఉంటాయి? ఇవి ఎప్పుడు ప్రారంభం అయ్యాయి?
బ్రూనై దేశం ఆగ్నేయాసియాలోని బోర్నియో ద్వీపంలో ఉంటుంది. ఇది దక్షిణ చైనా సముద్రంలో చైనాకు అభిముఖంగా ఉంటుంది. బోర్నియో ద్వీపంలో బ్రూనైతో పాటు మలేషియా, ఇండోనేషియా దేశాలు కూడా ఉంటాయి. కానీ బ్రూనై ఎక్కువ భాగాన్ని కలిగి ఉంటుంది. ఇక్కడ 2010 జనాభా లెక్కల ప్రకారం 4 లక్షల మంది నివసిస్తున్నట్లు అంచనా. 7వ శతాబ్దంలో బ్రూనై దేశం ప్రత్యేకంగా పిలవబడుతోంది. 1888 నుంచి బ్రిటీష్ నుంచి విడిపోయి సొంత దేశంగా పాలన వ్యవస్థను ఏర్పాటు చేసుకంది. 1984 జనవరి 1 నుంచి యూనైటైడ్ కింగ్ డమ్ గా బ్రూనై పూర్తిగా స్వతంత్ర దేశంగా అవతరించింది. బ్రూనై దేశ వ్యవస్థాపకుడిగా అవాంగ్ అలాంగ్ బెటారర్ అని పిలుస్తారు. దాదాపు 15 నుంచి 17వ శతాబ్ధం వరకు బ్రూనై దేశంలో సుల్తానుల పరిపాలన సాగింది.

బ్రూనై, భారత్ దేశాల మధ్య 1984లో ప్రారంభమైంది. 1992 సెప్టెంబర్ లో ఆ దేశ సుల్తాన్ హన్సనల్ బోల్కియా భారత దేశాన్ని మొదటిసారిగా పర్యటించారు. అయితే బ్రూనైలో చమురు అధికంగా ఉత్పత్తి చేయబడుతుంది. దీంతో భారతీయులు బ్రూనైకి వలస వెళ్లడం ప్రారంభించారు. కొందరు ఉపాధ్యాయులు కూడా ఇక్కడికి వచ్చి వారితో సంబంధాలు ఏర్పరుచుకున్నారు. 2013 నాటికి బ్రూనైలో దాదాపు 10 వేల మంది భారతీయులు నివసిస్తున్నారు.
బ్రూనై, భారత్ ల మధ్య ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కమ్యూనికేషన, సంస్కృతి, వాణిజ్య ఒప్పందాలపై 2008లో సంతకాలు చేశాయి. భారతేశానికి బ్రూనై నుంచి ప్రధానంగా చమురు ఎగుమతి చేయబడుతుంది. దీనికి ప్రతిఫలంగా భారత్ నుంచి మానవ వనరులను బ్రూనైకి ఎగుమతి చేస్తున్నారు. బ్రూనైలో ఉన్న ఎక్కువ మంది వైద్యులు భారతీయులే. 2010 నుంచి 2011 మధ్య భారత్, బ్రూనై మధ్య 34.55 మిలియన్ డాలర్ల ఎగుమతులు పెరిగాయి.
తాజాగా నరేంద్ర మోదీ బ్రూనై సందర్భంగా పలు ఒప్పందాలు చేసుకున్నట్లు విదేశాంగ అధికారులు వెల్లడించారు. త్వరలోనే రెండు దేశాల మధ్య విమాన సర్వీసులను ప్రారంభించనున్నట్లు తెలిపారు. అయితే భారత్ నుంచి బ్రూనై కి వెళ్లి మొదటి ప్రధాని మోదీనే కావడం విశేషం.. ఆ తరువాత మోదీ సింగపూర్ వెళ్లారు.