పారిస్ ఒలంపిక్స్ ఘంగా ముగిసాయి. గత 17 రోజుల పాటు క్రీడా కారులతో కళకళ లాడనున్న పారిస్ నగరం ఇక బోసి పోనుంది. పారిస్ ఒలంపిక్స్ లో మొత్తం 206 దేశాలు పాల్గొన్నాయి. ఈ దేశాలకు చెందిన మొత్తం 10,714 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. మొత్తం 32 క్రీడాంశాల్లో పోటీలు పడ్డారు. భారత్ నుంచి మొత్తం 117 మంది క్రీడాకారులు పారిస్ ఒలంపిక్స్ లో పాల్గొన్నారు. వీరు 16 క్రీడాంశాల్లో పాల్గొన్నారు. మొత్తంగా అమెరికా 40 బంగారు పతకాలతో అగ్రస్థానంలో నిలిచింది. ఆ తరువాత చైనా 40 స్వర్ణాలు సహా మొత్తం 91 పతకాలు పొంది రెండో స్థానంలో నిలిచింది. భారత్ ఆరు పతకాలతో 71 వ స్థానంలో ఉంది. వీటిలో ఒక రజతం, 5 కాంస్యం పథకాలు ఉన్నాయి.
2020లో టోక్కో వేదికగా సాగిన ఒలంపిక్స్ లో భారత్ మొత్తం 7 పతకాలు తీసుకొచ్చింది. వీటిలో ఒక స్వర్ణం, రెండు రజతాలు, 4 కాంస్యాలు ఉన్నాయి. అంటే గత ఒలంపిక్స్ తో పోలిస్తే ఈసారి భారత్ కు తక్కువే అని చెప్పొచ్చు. అదీ గాక గత ఒలంపిక్స్ లో నీరజ్ చోప్రా జావెలిన్ త్రో విభాగంలో స్వర్ణం తీసుకొచ్చారు. రెండు రజతాలు వచ్చాయి. ఈసారి అదే నీరజ్ చోప్రా రజతం తెచ్చి గౌరవం కాపాడారు. అయితే వినేశ్ పొగట్ విషయం కోర్టులో ఉంది. ఈవిషయంపై క్లారిటీ వచ్చిన రజతం వస్తే పతకాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
2024 ఒలంపిక్సలో మనుబాకర్ ప్రధాన ఆకర్షణీయంగా నిలిచారు. ఈమెకు షూటింగ్ విభాగంలో రెండు వేరియంట్లలో రెండు కాంస్య పతకాలు సాధించడం హైలెట్ గా నిలిచారు. ఇదే విభాగంలో స్వప్పిల్ కుశాలెకు కాంస్యం వచ్చింది, రెజ్లింగ్ విభాగంలో అమన్ సెహ్రావత్ కాంస్యం సాధించారు. ఎంతో కాలంగా పతకాలకు దూరంగా ఉన్న హాకీ విభాగంలో ఈసారి కాంస్యం వచ్చింది. అయితే టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్, షూటర్ విభాగంపై భారత్ ఆశలు పెట్టుకుటంది. కానీ ఈ ప్లేయర్లు నాలుగోస్థానంలోనే తప్పుకున్నారు.