Wednesday, June 25, 2025

స్వాతంత్య్ర దినోత్సవ వేళ.. డిప్యూటీ సీఎం పవన్ షాకింగ్ నిర్ణయం.. దశాబ్దాల చరిత్రకు స్వస్తి..

భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లకు పైగా అవుతోంది. దేశంలోని ప్రతీ ఏటా రెండు సార్లు జెండా పండుగను నిర్వహించుకుంటాం. వీటిలో 1947లో దేశానికి స్వాతంత్య్రం వచ్చిన సందర్భంగా ఆగస్టు 15న ఇండిపెండెన్స్ డే నిర్వహించుకుంటాం. ఈరోజు విద్యార్థుల నుంచి పెద్ద వారి వరకు ప్రతి ఒక్కరూ జెండా పండుగలో పాల్గొంటారు. ఇదే సమయంలో గ్రామగ్రామాన, ప్రధాన కూడళ్లలో జెండాను ఎగురవేస్తారు. అయితే ఈ కార్యక్రమ నిర్వహణకు చాలా మంది సొంతంగానే నిధులు నిర్వహించరుకుంటారు. అయతే ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమాలు సైతం స్థానికంగానే నిధులు ఏర్పాటు చేసుకుంటాయి. రాష్ట్రం ప్రభుత్వం ఈ కార్యక్రమ నిర్వహణకు గ్రామాలకు రూ.100, మేజర్ గ్రామ పంచాయతీలకు రూ.250 నిధులను ఇస్తుంది.

ఇలా స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి కొనసాగుతోంది. కానీ ఈసారి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమానికి ఖర్చుల నిమిత్తం చిన్న గ్రామ పంచాయతీలకు రూ.10 వేలు, మేజర్ గ్రామ పంచాయతీకు రూ.25 వేల నిధులు ప్రకటించారు. ఈ నిధులను వెంటనే విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేశారు. దశాబ్దాల చరిత్రకు స్వస్తి పలుకుతూ పవన్ తీసుకున్న ఈ నిర్ణయం సర్వత్రా చర్చ సాగుతోంది.

ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గ్రామాల్లో వేడుకలు నిర్వహించడం భారంగా మారిందన్నారు. ఈసారి జెండా పండుగలో పంచాయతీ పరిధిలోని పాఠశాలలు, ప్రభుత్వ కార్యక్రమాల్లో ఘనంగా నిర్వహించేందుకు నిధులు పెంచుతున్నామన్నారు. గ్రామాల్లోని పారిశుధ్య కార్మికుల నుంచి సమర యోధుల వరకు సన్మానించి ఇండిపెండెన్స్ డే విశిష్టతను తెలియజేయాలని పవన్ తెలిపారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News