Tuesday, June 24, 2025

France ఒలంపిక్స్ 2024 : భారత్ కు ఇప్పటి వరకు ఎన్ని స్వర్ణాలు(బంగారు పతకాలు) వచ్చాయి? ఏ విభాగంలో వచ్చాయి?

ప్రపంచ క్రీడా పండుగ ఒలంపిక్స్ త్వరలో ప్రాన్స్ లో ప్రారంభం కాబోతుంది. జూలై 26న అట్టహాసంగా ఇవి మొదలై ఆగష్టు 11 వరకు సాగుతాయి. ఈ సారి ఒలంపిక్స్ క్రీడల్లో పాల్గొనేందకు ప్రపంచం నుంచి మొత్తం 10,500 ఆటగాళ్లు పాల్గొంటారు. భారత్ నుంచి సుమారు 100 మందికి పైగా అథ్లెట్స్ పాల్గొనే అవకాశం ఉంది. ఈ ఒలంపిక్స్ లో మొత్తం 32 క్రీడలు, 329 ఈవెంట్లు నిర్వహించనున్నారు. భారత్ నుంచి వెళ్లే క్రీడాకారులు బ్యాడ్మింటన్, రెజ్లింగ్, జావెలిన్ త్రో, షూటింగ్, బాక్సింగ్, హాకీ విభాగాల్లో పాల్గొంటారు.

క్రికెట్ లో జగజ్జేతగా నిలుస్తున్న భారత్ ఒలంపిక్స్ లోనూ తన సత్తా చాటడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. భారత్ నుంచి 1900 సంవత్సరానికి ముందు నుంచే ఒలంపిక్స్ లో క్రీడాకారులు పాల్గొంటున్నారు. చివరి సారిగా 2020లో జరిగిన టోక్యో ఒలంపిక్స్ లో అత్యధికంగా అథ్లెట్లు ఏకంగా 7 పతకాలు సాధించారు. వీరిలో నీరజ్ చోప్రా జావెలిన్ త్రో విభాగంలో మొదటిసారి స్వర్ణం తెచ్చిపెట్టారు. ఈసారి పారిస్ లో జరిగే ఒలంపిక్స్ ఈ సంఖ్య పెంచాలని కోరుకుంటున్నారు.

ఒలంపిక్స్ లో స్వర్ణ సాధించడం అంటే మాములు విషయం కాదు. కొన్ని విభాగాల్లో ఎంత ప్రయత్నించినా సిల్వర్, బ్రౌంజ్ వరకే పరిమితం అవుతున్నారు. అయితే ఒలంపిక్స్ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు భారతీయులు ఏ యే విభాగాల్లో ఎన్ని స్వర్ణాలు సాధించారో చూద్దాం..

The-India-Won-gold-Medal-In-1952
The-India-Won-gold-Medal-In-1952 (This Image Took From NDTV Sports Website)

భారత జాతీయ క్రీడా హాకీ అని అందరికీ తెలుసు. దీనిని ఒలపిక్స్ లో ప్రవేశపెట్టినప్పటి నుంచి మనోళ్లు సత్తా చూపిస్తున్ారు. ఇందులో భాగంగా ఒలంపిక్స్ లో మొత్తం 6 స్వర్ణాలను గెలుచుకున్నారు. 1932లో దిగ్గజ క్రీడాకారుడు ధ్యాన్ చంద్ నేతృత్వంలో తొలిసారిగా , 1936 బెర్లిన్ ఒలంపిక్స్ వేదికగా.. 1948, 1952, 1956, 1964 ఒలంపిక్స్ లో బంగారు పతకాలు గెలుచుకున్నారు.

2008వ సంవత్సరంలో బీజింగ్ లో జరిగిన ఒలంపిక్స్ లో షూటింగ్ లో భారత్ కు తొలిసారిగా అభినవ్ బింద్రా స్వర్ణం గెలుచుకున్నాడు.

2020లో టోక్యో ఒలంపిక్స్ జావెలిన్ త్రో విభాగంలో నీరజ్ చోప్రా మొదటిసారి స్వర్ణాన్ని తీసుకువచ్చాడు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News