భారత క్రికెటర్ మహ్మద్ షమీ, టెన్నీస్ ప్లేయర్ సానియా మీర్జాపై వస్తున్న వార్తలపై షమీ స్పందించాడు. వీరిద్దరు వివాహం చేసుకోబోతున్నారని కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఫేస్బుక్, యూట్యూబ్ లో వీరి పెళ్లి రకరకాల వీడియోలు రిలీజ్ అయ్యాయి. అయితే వీటిపై షమీ తీవ్రంగా స్పందించాడు. ఇలాంటి వార్తలను ఆపాలని కోరాడు. ఇలా చేయడం వల్ల జీవితాలు ప్రమాదంలో పడుతాయని ఆయన వ్యాఖ్యానించాడు. ఇలాంటి నిరాధారమైన వార్తలు ప్రసారం చేయొద్దని అన్నారు. ఈ సందర్భంగా తన ఎక్స్ ఖాతాలో ఓ మెసేజ్ పెట్టారు.
‘నేను ఫోన్ తెరిచనప్పటి నుంచి ఇలాంటి మీమ్స్ వస్తున్నాయి.. ఇవి చూడ్డానికి ఇతరులకు వినోదంగా ఉండొచ్చు. కానీ రెండు జీవితాలకు సంబంధించిన విషయం అని గుర్తుపెట్టుకోవాలి. నేను వీటిని పట్టించుకోవద్దని అనుకున్నాను. కానీ దీనిని ధ్రువీకరించకపోతే మరింత ప్రమాదంలో పడే అవకాశం ఉందని తెలుస్తోంది. నేను ఒక్కటే చెప్పాలనుకున్నాను. ఈ విషయాలపై ఆధారాలుంటే అధికారిక ఖాతా నుంచి పోస్టు చేయండి.. అప్పుడు వారికి నేను సమాధానం ఇస్తాను.. మీ జీవితం కోసం పోరాడండి.. ప్రజలకు సాయం చేయండి.. కానీ ఇలాంటివి ప్రచారం చేయొద్దు..’ అని షమీ స్పందించారు.