ఇండియన్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా ఇప్పుడు ప్రత్యేకం అని చెప్పాలి. టీ20 వరల్డ్ కప్ 2024లో హార్దిక్ అత్యంత ప్రతిభను ప్రదర్శించాడు. సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో హార్దిక్ తన చాకచక్య బౌలింగ్ తో జట్టును గెలిపించడంలో కీలకంగా మారాడు. ఇటీవలే సొంతగడ్డపై అడుగుపెట్టిన హార్దిక్ కుటుంబ సభ్యులతో సరదాగ గడుపుతున్నాడు. ఈ తరుణంలో అతని సోదరుడు కృనాల్ పాండ్యా ఉద్వేగభరితమైన పోస్టు పెట్టాడు. ఇందులో ఏముందంటే?
టీ20 వరల్డ్ కప్ లో హార్దిక్ పాండ్యా కీలకంగా మారాడు. ఫైనల్ మ్యాచ్ లో మూడు ఓవరకు 20 రన్స్ ఇచ్చి మూడు వికెట్లు తీసుకున్నాడు. దీంతో సౌతాఫ్రికా పరుగులు తగ్గి భారత విజయానికి కారణమయ్యాడు. అయితే హార్దిక్ పాండ్యా గత ఐపీఎస్ మ్యాచ్ లో పేవల ప్రదర్శన చేశాడు. ముంబై ఇండియన్స్ తరుపున కెప్టెన్ గా ఉన్న అతడు తన నిర్ణయాలతో నాకౌట్ స్థానానికి తీసుకెళ్లలేకపోయాడు. ఆ తరువాత గాయాల కారణంగా వన్డే ప్రపంచ కప్ కు దూరమ్యాడు. ఈ సందర్భంగా అవన్నీ గుర్తు చేస్తే కృనాల్ ఓ మెసేజ్ పెట్టాడు.
‘హార్దిక్, నేను క్రికెట్ ఆడడం మొదలు పెట్టి దశాబ్దం అవుతుంది. ఇప్పుడు హార్దిక్ ను చూస్తే ఇది కలా? నిజమా? అని అనిపిస్తుంది. గత ఆరు నెలలుగా హార్దిక్ కష్టతరమైన రోజులు గడిపాడు. అతను అనుభవించిన బాధను మాటల్లో చెప్పలేమం. కొందరు అతడిని అర్హత లేని వాడు అని అనడంపై చాలా బాధపడ్డాను. అయితే ఓ వైపు బాధను అధిగమిస్తూనే.. మరోవైపై టీ 20 ప్రపంచ కప్ అందుకోవడానికి ఏం చేయాలో ఆలోచిస్తూ ఉండేవాడు.టీమిండియా కల సాకారం కావడానికి హార్ధిక్ కూడా భాగమకైనందుకు ఎంతో సంతోషిస్తున్నా’ అని కృనాల్ తన ఎక్స్ ఖాతాలో రాసుకొచ్చాడు.