కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘భారతీయుడు-2’. ఈ మూవీ ట్రైలర్ను చిత్ర యూనిట్ ముంబైలో జరిగిన ఈవెంట్లో విడుదల చేసింది. సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ఎస్ఓ సూర్య వంటి స్టార్లు ఈ సినిమాలో నటిస్తున్నారు. ‘ఇది రెండో స్వాతంత్ర పోరాటం. గాంధీజీ మార్గంలో మీరు, నేతాజీ మార్గంలో నేను’ అంటూ కమల్ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటోంది. కాగా ఈ మూవీ జులై 12న విడుదల కానుంది.