పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. సీల్దా నుంచి బయలుదేరిన కాంజనజంగా ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పింది. దీంతో రైలు బోగీలు బోల్తా పడ్డాయి. ఇదే పట్టాలకు మరో గూడ్స్ రైలు వచ్చి ప్రమాదానికి గురైన రైలును ఢీకొనడంతో బోగీలు గాల్లోకీ లేచాయి.
సీల్దా -బౌండ్ కాంజన జంగా ఎక్స్ ప్రెస్ న్యూ జల్ జైగురి స్టేషన్ నుంచి బయలుదేరింది. రంగపాణి ప్రాంతానికి చేరుకోగానే ఎదురుగా వస్తున్న గూడ్స్ రైలును ఢీకొట్టింది. దీీంతో రెండు రైళ్లు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు ఐదుగురు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఘటనా స్థలానికి ఆర్పీఎఫ్, జీఆర్పీఎఫ్ సిబ్బంది చేరుకొని సహాయ చర్యలు ప్రారంభించారు. సిగ్నిలింగ్ సమస్యతోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కాగా రెండు రైళ్లు ఢీకొన్న నేపథ్యంలో బోగీలు గాల్లోకి లేచాయి.
पश्चिम बंगाल में रेल हादसा, डाउन कंचनजंगा एक्सप्रेस से टकराई मालगाड़ी, फिलहाल 6 घायलों की सूचना
— Manraj Meena (@ManrajM7) June 17, 2024
अभी तक किसी जनहानि की खबर नहीं, राहत और बचाव के लिए रेलवे दल रवाना…#WestBengal #TrainAccident @IRCTCofficial @RailMinIndia pic.twitter.com/mhsDQpXHTw