Tuesday, June 24, 2025

వామ్మో ‘ఎయిర్ ఇండియా’.. రూ.5 లక్షల టికెట్ కొన్నా.. ఈ సౌకర్యాలేంటి సామి..! ఓ ప్రయాణికుడి ఆవేదన..

బస్సుల్లో, రైలులో ప్రయాణం చేసేటప్పుడు కొన్ని అసౌకర్యాలు కలుగుతాయి. కొందరు వీటిపై నిలదీస్తారు. మరికొందరు పట్టించుకోరు. వీటి టికెట్ రూ.10లు, రూ.100 వరకు ఉంటుంది కాబట్టి ఇక్కడ సౌకర్యాలపై పెద్దగా ఇంట్రెస్ట్ చూపరు. కానీ రూ.5 లక్షలు పెట్టి టికెట్ కొనుగోలు చేసి విమాన ప్రయాణం.. అదీకూడా బిజినెస్ క్లాస్ ప్లెయిన్. ఇక్కడ కూడా అసౌకర్యంగా ఉంటే ఏ ప్రయాణికుడు ఊరుకుంటాడు.. కానీ ఓ ప్రయాణికుడు ఎయిర్ ఇండియా పెట్టిన కష్టాలను భరించి తన ఆవేదనంతా X ఖాతా ద్వారా వెల్లడించారు.

తాజాగా ఎయిర్ ఇండియా విమానం దేశ రాజధాని న్యూఢిల్లీ నుంచి న్యూయార్క బయలుదేరింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ కంటే 25 నిమిషాల అలస్యంగా టేక్ అఫ్ అయింది. ఇక విమానంలో సీటు శుభ్రంగా లేదు. బాగా మురికిగా ఉంది. అలాగే సీట్లకు ఉండే కవర్లు సైతం ఆవరిశుభ్రంగా ఉన్నాయి. నిద్రకు ఉపక్రమించే క్రమంలో సీటు వెనక్కి నెట్టితే వెళ్లడం లేదు. విమాన సిబ్బంది సరఫరా చేసిన ఆహారం సైతం చెత్తగా ఉంది. మరోవైపు నిమానంలో టీవీ సైతం పని చేయడం లేదు. ఇక తన లగేజీకి ఉన్న ట్యాగ్ ఊడిపోయింది. అంతేకాదు తన సూట్ కేసు హ్యాండిల్ సైతం పగిలిపోయింది. ఇలా తనకు విమాన ప్రయాణంలో కలిగిన కష్టాలకు సంబంధించిన ఫొటోలను X వేదినగా వివేక్ అనే ప్రయాణికుడు పంచుకున్నాడు.

వివేక్ తరుచూ న్యూయార్క్ లండన్, షికాగో ప్రయాణిస్తూ ఉంటాడు. తాను ఎక్కువగా ఎమిరేట్ సంబంధించిన విమానాల్లో ఎక్కువగా ప్రయాణిస్తానని తెలిపాడు. తాజాగా ఎయిర్ ఇండియా బిజినెస్ క్లాస్ విమానంలో ప్రయాణం చేయాలనుకున్నానని తెలిపారు. అదీకూడా న్యూఢిల్లీ నుంచి న్యూయార్క్ కు నేరుగా ఈ సర్వీస్ ఉండడంతో ఎయిర్ ఇండియా సర్వీస్ ను ఎందుకున్నట్లు చెప్పారు. కానీ ఈ విమాన ప్రయాణం తనకు పీడకలలా మారిందని వివేక్ తెలిపాడు.

ఈ ఘటనపై ఎయిర్ ఇండియా సంస్థ X వేదికగా స్పందించింది.ఆ కొద్ది సేపటికి దానిని ఆ సంస్థ తన ఖాతా నుంచి తొలగించింది. మరోవైపు వివేక్ తన విమాన ప్రయాణంలో కలిగిన కష్టాలపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతోంది. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News