Telangana Loksabha Elections 2024: రాజకీయాల్లోకి వారసుల రావడం కామన్. అయితే తండ్రి పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకున్నప్పుడు లేదా వేరే సందర్భంగా వారసులు ఎంట్రీ ఇస్తారు. కానీ తండ్రులు రాజకీయాల్లో కొనసాగుతూనే తమ కుమారులను పొలిటికల్ ఫీల్డ్ లోకి దింపి వారిని గెలిపించుకున్నారు. తెలంగాణ కాంగ్రెస్ లో అలాంటి తండ్రులు ఉన్నారు. వారు వారెవరు? ఆ వివరాల్లోకి వెళితే..

పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గడ్డం వంశీ కృష్ణ 2024 పార్లమెంట్ ఎన్నికల్లో 1.32 లక్షల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈయన ఎవరో కాదు. కేంద్ర మాజీ మంత్రి కాకా వెంకటస్వామి మనవడు. అంతేకాకుండా వంశీ తండ్రి వివేక్ చెన్నూరు ఎమ్మెల్యేగా గెలుపొందారు. వంశీ పెద్దనాన్న వినోద్ బెల్లంపల్లి ఎమ్మెల్యేగా గెలిచారు. వెంకటస్వామి కూడా నాలుగు సార్లు పెద్దపల్లి ఎంపీగా గెలిచారు. కేంద్ర మంత్రిగా పనిచేశారు. 2009లో వివేక్ కూడా పెద్దపెల్లి ఎంపీగా పంపించారు. ఇప్పుడు ఇదే లోక్సభ స్థానం నుంచి వారి రాజకీయ వారసుడిగా బరిలోకి దిగిన వంశీకృష్ణ 1.32 లక్షల ఓట్ల రాజకీయంతో గెలుపొందారు.

నల్గొండ లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందిన కందూరు రఘువీరారెడ్డి కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి తనయుడు. జానారెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదు.
Bandi Sanjay: కేసీఆర్ రికార్డును అధిగమించిన బండి సంజయ్
https://insightearth.in/bandi-sanjay-bandi-sanjay-who-beat-kcrs-record/
కానీ ఇద్దరు కొడుకులను రాజకీయాలకు దించారు. చిన్న కొడుకు జయ వీరా రెడ్డి నాగార్జునసాగర్ లో ఎమ్మెల్యేగా పోటీ చేయించి గెలిపించుకున్నారు. పెద్దకొడుకు రఘువీరా రెడ్డికి తాజా ఎంపీ ఎన్నికల్లో నల్గొండ ఎంపీ టికెట్ ను ఇప్పించుకుని గెలిపించుకున్నారు. ఇద్దరు కొడుకులు ఇప్పుడు ప్రజాప్రతినిధులు అయ్యారు.

వరంగల్ లోక్సభ నియోజకవర్గ గురించి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన డాక్టర్ కడియం కావ్య 1.7 లక్షలకు పైగా ఓట్లతో ఘన విజయం సాధించారు. లోక్ సభ ఎన్నికలవేళ రాజకీయాల్లోకి వచ్చిన ఆమె తండ్రి కడియం శ్రీహరి ఉన్న బీఆర్ఎస్ లోనే చేరారు. వరంగల్ లోక్సభ నియోజకవర్గ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత తండ్రి కూతుర్లు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లోకి వెళ్లారు. ఆ పార్టీ నుంచి టికెట్ పొందిన కడియం శ్రీహరి తన కూతురును గెలిపించుకున్నారు.