Tuesday, June 24, 2025

కాలిఫోర్నియా సుపీరియర్ కోర్టు జడ్జిగా తొలి తెలుగు మహిళ ఎవరో తెలుసా?

అగ్రరాజ్యం అమెరికాలో తెలుగోళ్లు దూసుకుపోతున్నారు. ఇప్పటి వరకు సాప్ట్ వేర్, రాజకీయ రంగాల్లో రాణించిన వారు ఇప్పుడు న్యాయవాద రంగలోనూ అడుగుపెట్టారు. తాజాగా ఓ తెలుగు మహిళకు అరుదైన గౌరవ గౌరవం దక్కింది. కాలిఫోర్నియాలోని శాక్రమెంటు కౌంటీ సుపీరియర్ కోర్టు జడ్జిగా విజయవాడకు చెందిన జయ బాదిగ నియమితులయ్యారు. దీంతో తెలుగు రాష్ట్రాల నుంచి కాలిఫోర్నియాలో జడ్జిగా బాధ్యతలు చేపట్టిన తొలి వ్యక్తిగా నిలిచారు. జయబాదిగ 2022 నుంచి ఇదే కోర్టులో కమిషనర్ గా కొనసాగుతున్నారు.

ఆంధ్రప్రదేశ్లో విజయవాడకు చెందిన జయ బాదిగ హైదరాబాదులో 1991 నుంచి 1994 వరకు హైదరాబాద్ ఉస్మానియా విద్యాలయంలో గ్రాడ్యుయేట్ పూర్తి చేశారు. అనంతరం అమెరికా వెళ్లి ఆమె బోస్టన్ విద్యాలయంలో ఎంఏ పూర్తి చేశారు. ఆ తర్వాత శాంటా క్లారా విద్యాలయం నుంచి లా పట్టా అందుకున్నారు. 2009లో కాలిఫోర్నియా స్టేట్ బార్ ఎగ్జామ్ క్లియర్ చేశారు.

కోర్టు జడ్జిగా నియామకానికి ముందు 2018 నుంచి 2022 వరకు పదేళ్లుగా న్యాయవాద వృత్తిలో ప్రైవేట్ ప్రాక్టీస్ లో కొనసాగారు. ఈ క్రమంలో ఎలాంటి లాభపక్ష లేకుండా పలు కేసుల్లో ప్రభుత్వం తరఫున వాదించారు. సొంతంగా కుటుంబ న్యాయ వ్యవస్థను ప్రారంభించారు. కాలిఫోర్నియా డిపార్ట్ మెంట్ ఆఫ్ హెల్త్ కేర్ సర్వీసెస్ లో, కాలిఫోర్నియా గవర్నర్స్ ఆఫీస్ ఎమెర్జెన్సీలో అటార్నీ జనరల్ గా పనిచేశారు. అలాగే మేక్ జార్జ్ స్కూల్ ఆఫ్ లలో అధ్యాపకులుగా పని చేశారు.

Related Articles

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News