Wednesday, June 25, 2025

నిజాం కాలంలో తొలి తెలుగు పోలీస్ కమిషనర్.. విద్యాభివృద్ధికి ఎనలేని కృషి..ఈయన గురించి తెలుసా?

హైదరాబాద్ నిజాం పాలన గురించి ప్రస్తుతం ఉన్న వారిలో కొంత మందికే తెలిసి ఉంటుంది. కానీ చరిత్ర ద్వారా తెలుసుకుంటే మాత్రం ఆ కాలంలో కొన్ని వర్గాలపై నిజాం ప్రభుత్వం అమానుషంగా ప్రవర్తించిందని అర్థమవుతోంది. ముఖ్యంగా నిజాం పాలనలో రజాకార్ల వ్యవస్థ చేసిన ఆగడాలు అంతా ఇంతా కావు. వీరు ప్రభుత్వానికి సంబంధించిన పోలీసులు అయినప్పటికీ సామాన్యుల విషయంలో కఠినంగా ఉండేవారు. అయితే ఇలాంటి పోలీసు వ్యవస్థ ఉన్న కాలంలో ప్రేమాభిమానాలు, విద్యాఅభిృద్ధికి కృషి చేసిన ఓ తెలుగు ఉన్నతాధికారి పోలీసు ఉండేవారు. ఆయనే రాజా బహదూర్ పింగళి వెంకట రామారెడ్డి.

ఈ పేరు చాలా మందికి తెలియకపోవచ్చు. కానీ హైదరాబాద్ నగరంలో ఉండే పూర్వీకులను అడిగితే ఆయన గురించి చెబుతారు. పింగలి వెంకట రామారెడ్డి 1869 ఆగస్టు 22 నుంచి 1953 జనవరి 25 వరకు పోలీస్ కమిషనర్ గా పనిచేశారు. ఇప్పుడున్న వనపర్తి జిల్లా కొత్త కొండ మండలంలోని ఓ గ్రామంలో జన్మించిన వెంకట రామారెడ్డి చిన్న తనంలోనే తల్లిదండ్రులను కోల్పోయారు. ఆ తరువాత అమ్మమ్మ కిష్టమ్మ వద్ద చదువును కొనసాగించారు. ఆ తరువాత వివిధ భాషల్లో ప్రావీణ్యం సంపాదించారు.

1886లో పింగళి వెంటకరామారెడ్డి నజర్ మహ్మద్ సాయంతో 1886లో ముదిగ్లు పోలీస్ స్టేషన్ కు అమీను గా నియమితులయ్యారు. అమీను అంటే ఇప్పుడు సబ్ ఇన్ స్పెక్టర్. ఆ తరువాత నిజాం ఎస్టేట్ వ్యవహారాల్లో ప్రత్యేక అధికారిగా నియమితులయ్యారు. ఆ తరువాత మహబూబ్ నగర్, నిజామాబాద్, కరీంనగర్, రంగారెడ్డి జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో పోలీసు అధికారిగా పనిచేశారు. ఆ తరువాత హైదరాబాద్ లో నాయెబ్ కొత్వాల్(పోలీస్ కమిషనర్)గా.. చివరిగా కొత్వాల్ గా బాధ్యతలు చేపట్టారు. 1933లో పదవీ విరమణ పొందారు.

పింగళి వెంకటరామారెడ్డిని పోలీసు ఉన్నతాధికారికగా కాకుండా ఆయన చేసిన విద్యాభివృద్ధి గురించి చెప్పుకోవచ్చు. నగరంలోని శ్రీకృష్ణ దేవారాయాంధ్ భాషా నిలయం, వేమనాంధ్రా భాషా నిలయం, భాల సరస్వతి గ్రంథాలయ అభివృద్ధికి కృషి చేశారు. హైదరాబాద్ లో ఉన్న ప్రముఖ రెడ్డి హాస్టల్ ఈయన నెలకొల్పిందే. మాతృభాషాభిమానంతో కొందరు సహకారంతో ‘నిజాం రాష్ట్ర ఆంధ్ర సారస్వత పరిషత్తు’ను ఏర్పాటు చేశారు. తెలుగు భాషా అభివృద్ధే లక్ష్యంగా ఈ పరిషత్ పనిచేసింది.

1944 డిసెంబర్ లో ఓరుగల్లులో నిర్వహించిన ద్వితీ మహాసభలను వెంటటరామారెడ్డి నిర్వహించగా.. ఈ సభలకు ఉదయ రాజు రాజేశ్వర్ రావు ఆహ్వాన సంఘానికి అధ్యక్షులుగా, సురవరం ప్రతాపరెడ్డి అధ్యక్షులుగా కాళోజి నారాయణ రావు కార్యదర్శిగా ఉన్నారు. 1926లో గోల్కొండ పత్రిక స్థాపనకు ఈయన చేసిన కృషి మరువలేనిది. అనాథ బాలల కోసం ఆశ్రమాలు, కుష్ఠు నివారణ సంఘం, జంతు హింసా నివారణ సమితి వంటికి ధన సాయం అధికంగా చేశారు.

అయితే పింగళి సేవలను నిజాం రాజు గుర్తించారు. ఈ సందర్భంగా 1921లో పింగళి వెంటకరామారెడ్డికి ‘రాజా బహద్దూర్’ అనే గౌరవాన్ని ప్రకటించారు. అలాగే 1931లో ‘ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంఫైర్’ అనే గౌరవాన్ని ప్రదానం చేశారు. హైదరాబాద్ లోని నారాయణ గూడలో పింగళి వెంకటరామారెడ్డి విగ్రహాన్ని చూడొచ్చు. పింగళి వెంకట రామారెడ్డి స్థాపించిన రెడ్డి హాస్టల్ ద్వారా ఎంతో తెలుగు వారు గొప్ప గొప్ప వారయ్యారు. 1953 జనవరి 25న ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్లారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News