తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఆర్టీసికి కాసుల పంటను తెచ్చింది. మహిళలకు ఉచిత ప్రయాణం వల్ల సంస్థ నష్టపోతుందని కొందరు విమర్శించారు. కానీ ఉచిత ప్రయాణం వల్ల ఆర్టీసీ సంస్థకు లాభమే ఉంటుందని అధికార పార్టీ చెబుతూ వస్తోంది. అనుకున్నట్లుగానే ఈ రాఖీ పండుగకు ‘మహా లక్ష్మీ’ పథకం వరాలు ఇచ్చినట్లు అయింది. రాఖీ పండుగ సందర్భంగా మహిళల ప్రయాణం ఎక్కువగా ఉంటుంది. అయితే ఉచిత బస్సును చాలా మంది వినియోగించారు. దీంతో ఆదాయం ఎలా వస్తుంది? అని కొందరికి సందేహం రావొచ్చు. కానీ రాఖీ పండుగ సందర్భంగా ఆర్ఠీసీకి రూ.32 కోట్ల ఆదాయం వచ్చినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆ వివరాల్లోకి వెళితే..
అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా రాఖీ పండుగను నిర్వహించుకుంటారు. ప్రతీ రాఖీ పండుగకు మగవారి కంటే మహిళల ప్రయాణమే ఎక్కువగా ఉంటుంది. ఇదే సమయంలో బస్సు ఫ్రీ కావడంతో చాలా మంది మహిళలు బస్సుల్లో వెళ్లడానికే మొగ్గు చూపారు. తెలంగాణ రవాణా శాఖ మంత్రి చెప్పిన దాని ప్రకారం ఆగస్టు 19న మొత్తం 63.86 లక్షల మంది ప్రయాణం చేశారు. ఇందులో 41.74 మంది లక్షల మంది మహిళలు ఉననారు. అయితే మహిళల్లో కొంత మంది ఉచిత ప్రయాణం చేసినా.. 21.12 లక్షల మంది డబ్బులు చెల్లించి ప్రయాణం చేశారు. దీంతో ఆర్టీసీకి మొత్తంగా రూ.32 కోట్ల ఆదాయం వచ్చినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
ఆర్టీసీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ రాఖీ పండుగకు వచ్చిందని ఆయన పేర్కొన్నారు. భారీ వర్షం కురుస్తున్నా.. ఆర్టీ బస్సుల్లో నిరంతరం నడిపామని అన్నారు. ఈ సందర్భంగా ఆర్టీసీ సిబ్బందిని ఆయన ప్రశంసించారు. కొందరు డ్రైవర్లు, కండక్టర్లు రాఖీ కట్టుకొని విధుల్లో ఉన్నారని వారిని అభినందిస్తున్నట్లు తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ద్వారా ఆర్టీసీకి లాభాల పంట పండుతోందని అయన చెప్పొకొచ్చారు.