Wednesday, June 25, 2025

జియో, ఎయిర్ టెల్ To BSNL.. వారం రోజుల్లో 2.5 లక్షల మంది సబ్ స్క్రైబర్లు.. కానీ..

టెలికాం రంగంలో కొత్త ఒరవడి పుట్టుకొస్తోంది. ఒకప్పుడు BSNL సిమ్ లు తక్కువ ధరకు ఇస్తామన్నా కొనేవారు కరువయ్యారు. స్లో నెట్వర్క్ అని అసహించుకునేవారు. కానీ ఇప్పుడు బీఎస్ఎన్ఎల్ సేవల కోసం ఎగబడుతున్నారు. అందుకు కారణం మిగతా టెలికాం కంపెనీల చార్జీలు ధరల పెంచచడమే .జులై 3వ తేదీ నుంచి జియో, ఎయిర్టెల్, వోడాఫోన్ టారిఫ్ ధరలను సవరించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత బీఎస్ఎన్ఎల్ చందాదారుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ప్రతినెలా సబ్స్క్రైబర్లు కోల్పోవడమే తప్ప కొత్తగా చేర్చుకొని బీఎస్ఎన్ఎల్ కు ఇటీవల చాలామంది సబ్స్క్రైబర్లుగా మారుతున్నారు.

గడిచిన రెండు వారాల్లో బీఎస్ఎన్ ఎల్ కు 2.5 లక్షల మంది మొబైల్ నెంబర్ పోర్టబిలిటీ ద్వారా ఇతర నెట్వర్క్ నుంచి బీఎస్ఎన్ఎల్ కు మారినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మరో 25 లక్షల మంది కొత్త బీఎస్ఎన్ఎల్ కనెక్షన్లు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో హైదరాబాద్లో పలుచోట్ల బీఎస్ఎన్ఎల్ సిమ్ కార్డు విక్రయ కేంద్రాల సందడి వాతావరణం కనిపిస్తుంది. అయితే బీఎస్ ఎన్ ఎల్ టారిఫ్ సేవలు మిగతా వాటితో ప్రయోజనాలు అందిస్తూ సగం ధరకే లభిస్తున్నాయి. 28 రోజులకు ప్రైవేట్ టెలికాం కంపెనీలు 190 నుంచి 200 రూపాయల వరకు వసూలు చేస్తున్నాయి. అయితే BSNL లో మాత్రం 108కే ఈ ప్రయోజనాలు అందిస్తున్నాయి. కాకపోతే BSNL లో ఇప్పటికీ 4g సేవలు కూడా లేకపోవడం మైనస్ అని కొందరు వినియోగదారులు అంటున్నారు. టారిఫ్ పెరుగుదలతో ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ కు మారుతున్నా అది తాత్కాలికమే అని కొందరు పేర్కొంటున్నారు. అయితే ప్రైవేట్ కంపెనీలకు పోటీగా BSNL 4g ,5g సేవలను అందిస్తే అప్పుడు వినియోగదారులు కాపాడుకోగలదని అంటున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News