కరీంనగర్: తెలంగాణ రాష్ట్ర పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య 99 వ జయంతి ఉత్సవాలు ఏప్రిల్ 3న తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనుంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలంగాణ ఫూలె బీసీ సంక్షేమ సంఘం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ కడారి అయిలన్న కురుమ , జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిగుర్ల శ్రీనివాస్ కురుమ తెలిపారు. ఈ సందర్భంగా వారు మీడియా మిత్రులతో మాట్లాడారు. దొడ్డి కొమురయ్య జయంతి ఉత్సవాలకు సుబ్బండ వర్గాల ప్రజలు, అన్ని కుల సంఘాల నాయకులు, అన్ని రాజకీయ పార్టీల నాయకులు హాజరై విజయవంతం చేయాలన్నారు. పెత్తందారుల ఆగడాలకు వ్యతిరేకంగా పోరాడిన దొడ్డి కొమురయ్య త్యాగాలను, ధైర్య సాహసాలను నేటి తరానికి బోధిస్తూ , వారిని స్మరించుకుంటూ అన్ని మండల కేంద్రాలలో, జిల్లా కేంద్రాలలో రాష్ట్ర రాజధానిలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారన్నారు. కావున ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు.





