జమ్ము కాశ్మీర్ లోని పహాల్గాం మళ్లీ పర్యాటకులతో కిటకిటలాడుతోంది. భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య జరిగిన ఉద్రిక్తల నేపథ్యంలో రెండు నెలలపాటు ఇక్కడి పర్యాటక ప్రదేశాలను మూసివేశారు. అయితే ఇటీవల మళ్ళీ అందమైన ప్రదేశాలకు ప్రజలు తరలి వస్తున్నారు. ఇప్పటివరకు మూసి ఉన్న తోటలు, పార్కులు అన్ని మళ్లీ తెరిచి పర్యాటకులను ఆహ్వానిస్తున్నట్లు జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా తెలిపారు. అలాగే తాజాగా జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా తన ఎక్స్ ఖాతాలో పహాల్ గాంకు సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేశారు. ఈ ఫోటోలో భక్తుల రద్దీ ఎక్కువగా కనిపిస్తుంది.
గత ఏప్రిల్ 22న జమ్మూకాశ్మీర్లోని పహాల్గంలో కొందరు ఉగ్రవాదులు పర్యాటకులపై దాడి చేసిన విషయం తెలిసిందే. ఇక్కడ విచక్షణ రహితంగా కాల్పులు జరపడంతో 26 మంది చనిపోయారు. దీంతో దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తం అయింది. ఈ క్రమంలో భారత ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకొని ఉగ్రవాద శిబిరాలపై దాడి చేసింది. అయితే ఆ తర్వాత పాకిస్తాన్ ప్రభుత్వంతో కూడా ఉద్రిక్తలు నెలకొన్న నేపథ్యంలో జమ్ము కాశ్మీర్లోని చాలావరకు పర్యాటక ప్రాంతాలను మూసివేశారు. దీంతో ఆయా ప్రాంతాలు స్తబ్దంగా ఉండిపోయాయి.
అయితే మళ్లీ భద్రత చర్యలతో పర్యాటకులను ఆహ్వానించారు. మినీ స్విట్జర్లాండ్ గా పేర్కొనపడే జమ్ము కాశ్మీర్లో పలు ప్రాంతాలు ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తాయి. చుట్టూ కొండలు, మధ్యలో తోటలతో పచ్చని వాతావరణం మనసుకు ఎంతో ఆయనిస్తుంది. అంతేకాకుండా ప్రస్తుతం ఇక్కడ చల్లని వాతావరణం ఉండడంతో మరింత అందాన్ని ఇస్తుంది. అందుకే చాలామంది పర్యాటకులు ఇక్కడికి తరలివస్తున్నారు. దేశీయంగా ఉన్న వారే కాకుండా విదేశాల నుంచి చాలామంది ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. అయితే సాక్షాత్తు జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఫోటోలను సోషల్ మీడియాలో ఉంచడం వల్ల కొందరు ఇక్కడికి రావాలని ఆసక్తి చూపుతున్నారు.
The last time I was in Pahalgam I cycled through a market that was all but deserted. Today I came back to a Pahalgam that was bustling with activity. Tourists from various parts of the country competed for space with local picnickers who were enjoying the cool climate & rainy… pic.twitter.com/Mm9puLMOEG
— Omar Abdullah (@OmarAbdullah) June 22, 2025