Tuesday, June 24, 2025

‘మిస్ వరల్డ్’ పేరు ఎలా వచ్చింది? మొదటి విజేత ఎవరు?

అందానికి మించిన ఆస్తి లేదని కొందరి భావన.. అలాంటి అందం అతివల సొంతం మాత్రమే. అయితే ఆ అందానికి కూడా పోటీ పెడితే మరింత అందమైన వారు బయటకు వస్తారు అని ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ సుందరి పోటీలను నిర్వహిస్తూ వస్తున్నారు. ఇందులో భాగంగా 2025 మిస్ వరల్డ్ పోటీలు భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రం హైదరాబాదులో నిర్వహిస్తున్నారు. ఇప్పటికే నగరంలోని గచ్చిబౌలి స్టేడియం మిస్ వరల్డ్ పోటీలకు సిద్ధమైంది. మే 5 నుంచి ఈ పోటీ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. తొలి రోజు సాంస్కృతిక కార్యక్రమాలు, జాతీయ, రాష్ట్రీయ గీతాల పనులు ఉండనున్నాయి. ఇలా 23 రోజులపాటు ఈ పోటీలు సాగి.. జూన్ 2న ముగుస్తాయి. అయితే మిస్ వరల్డ్ అనే పదం ఎక్కడి నుంచి పుట్టింది? దీనికి ఆ పేరు ఎలా పెట్టారు ఇప్పుడు తెలుసుకుందాం..

అందానికి కూడా కాంపిటీషన్ ఉండాలని ఉద్దేశంతో తొలిసారిగా లండన్ లోని టెలివిజన్ హోస్ట్ అయిన ఎరిక్ డాగ్స్ మోర్లే ప్రపంచ సుందరి పోటీలు నిర్వహించారు. 1951 లో ఫెస్టివల్ ఆఫ్ బ్రిటన్ వేడుకల్లో భాగంగా Swim Shoot కాంటెస్ట్ నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమాన్ని మొదటిసారిగా అంతర్జాతీయ మీడియా అయిన బీబీసీ లో ప్రసారం చేశారు. ఈ కార్యక్రమానికి ఆ టెలివిజన్ ‘మిస్ వరల్డ్’ అని పేరు పెట్టింది. ఈ ప్రోగ్రాం 1960, 70 దశకంలో బాగా పాపులర్ అయింది. దీంతో ఆ పేరుతోనే రిజిస్టర్ చేయించి పోటీలను నిర్వహిస్తున్నారు.

ఆ తర్వాత 1972లో ‘బ్యూటీ విత్ ఏ పర్పస్’ కార్యక్రమాన్ని జూలియా మోర్లే ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా నిధులను సేకరించి పిల్లలు, మహిళల చదువు కోసం వినియోగిస్తారు. మిస్ వరల్డ్ పోటీల్లో మొదటిసారిగా స్వీడన్ చెందిన కికి హకన్సన్ 1951 లో టైటిల్ ని గెలుచుకున్నారు. ఇప్పటివరకు నిర్వహించిన పోటీల్లో జమైకా దేశానికి చెందిన టోనీ ఆన్సింగ్ ఎక్కువ కాలం పాటు మిస్ వరల్డ్ గా కొనసాగారు. 2019లో మిస్ వరల్డ్ అయిన ఆమె మధ్యలో కరోనా రావడంతో అలాగే కొనసాగారు అలా 2021 వరకు ఉన్నారు. 2024 సంవత్సరంలో మిస్ వరల్డ్ కిరీటాన్ని చెక్ రిపబ్లిక్ చెందిన క్రిస్టినా పిస్కోవా టైటిల్ గెల్చుకున్నారు. ఈ పోటీలో భారత్లోని ముంబైలో నిర్వహించారు.

ఇప్పటివరకు భారత్కు చెందిన ఆరుగురు మిస్ వరల్డ్ టైటిల్లు గెలుచుకున్నారు. వీరిలో మొదటిసారిగా రీతాపార్య పావెల్, ఐశ్వర్యారాయ్, డయానా హెడెన్, యుక్తముకి, ప్రియాంక చోప్రా, మనుషి చిల్లర్.. ఉన్నారు. 2025 మిస్ వరల్డ్ పోటీల్లో భారత్ తరపున నందిని గుప్తా పోటీలో ఉన్నారు. ఈమె 2023 లో మిస్ రాజస్థాన్ టైటిల్ గెలుచుకున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News