Wednesday, June 25, 2025

Women’s Day Special: ఈ ముగ్గురి గురించి నేటి యువత తెలుసుకోవాల్సిందే..

ఒకప్పుడు మహిళలు ఇంటికే పరిమితం అయ్యారు. ఇప్పుడు కూడా కొన్ని ప్రాంతాల్లో ఇంట్లో నుంచి అడుగు బయటపెట్టడం లేదు. కానీ కొందరు మాత్రం అసాధారణ పనులు చేస్తూ పురుషులకు ధీటుగా నిలుస్తున్నారు. ముఖ్యంగా అత్యధిక వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత్ లో మహిళలు వివిధ రంగాల్లో వేగంగా రాణిస్తున్నారు. ఇప్పటికే దేశాధ్యక్ష పదవిలో ద్రౌపది ముర్ము ఉండగా.. దేశ ఆర్థిక వ్యవస్థను నిర్మలా సీతారామన్ నడిపిస్తున్నారు. అయితే మొన్నటి వరకు రక్షణ రంగంలో ఆడవాళ్లు అడుగు పెట్టాలంటే భయపడేవాళ్లు. కానీ ఇప్పుడు భారత వైమానిక దళంలో వారు తమదైన ప్రతిభ చూపిస్తున్నారు. వీటిలో ఫ్లైట్ ఫైటర్స్ గా అద్భుత ప్రతిభను చూపిస్తున్న ఈ ముగ్గురి గురించి ప్రత్యేకంగా తెలుసుకోవాల్సిందే..

ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా గొప్ప విజయాలు సాధించిన మహిళల గురించి స్మరించుకుంటూ ఉంటారు. అయితే ప్రస్తుతం ఈ ముగ్గురు విమాన సర్వీసుల రంగంలో భావనా కాంత్, మోహనా సింగ్, అవని చతుర్వేదిలు ఉంటూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్న వీరి గురించి వివరాల్లోకి వెళితె..

భావనా కాంత్:

ఇండియా తొలి మహిళా ఫైటర్లలో భావనా కాంత్ ఒకరు. బీహార్ లోని దర్భంగాలో జన్మించారు. ఈమె చిన్నప్పుడు ఖోఖో, బ్యాడ్మింటన్, స్విమ్మింగ్, పెయింటింగ్ వంటి క్రీడల్లో ప్రావీణ్యం సాధించారు. చిన్నప్పటి నుంచే విమానాలు నడపాలనే కోరికతో ఉన్న ఈమె పట్టుదలతో బెంగుళూరులోని పీఎంఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో బయోమెడికల్ ఇంజనరింగ్ చేశారు.

ఆ తరువాత టాటా కంపెనీలో ఉద్యోగం సాధించారు. ఆ తరువాత 2016లో జూన్ 18లో ఈమె విధుల్లో చేరారు. ప్రయోగాత్మకంగా మహిళల కోసం భారత వైమానిక దళంలో ఫైటర్ స్ట్రీమ్ ను ప్రారంభించాలని అనుకున్నారు. ఇందులో భాగంగా మొదటిగా ఎంపికైన ముగ్గురు మహిళ్లలో భావనా కాంత్ మొదటి పేరుగా నిలిచింది. అంతేకాకుంండా మిగ్ విమానాలు నడిపిన మొదటి మహిళగా రికార్డు సృష్టించారు. 2019లో భావనా కాంత్ నారీ శక్తి పురస్కారాన్ని అందుకున్నారు.

మోహనాసింగ్:

మోహనాసింగ్ రాజస్థాన్ లోని జున్ జున్ జిల్లాలో జన్మించారు. తండ్రి వాయుసేనలో ఉండడంతో ఈమెకు విమానాలునడపాలనే కోరిక ఉండేది. దీంతో అమృత్ సర్ లోని గ్లోబల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీలో గ్రాడ్యుయేషన్ చేశారు.

ఆ తరువాత 2019లో హాక్ ఎంకే 132 అడ్వాన్స్ జెట్ నడిపిన మొదటి మహిళా ఫైటర్ గా పేరు తెచ్చుకున్నారు. 2019లో ఎయిర్ టు ఎయిర్, ఎయిర్ టు గ్రౌండ్ లో శిక్షణ పూర్తి చేసుకొని ఫైటింగ్ స్వ్కాడ్రన్ లో చేరారు. 2020లో నారీశక్తి పురస్కారాన్ని అందుకున్నారు.

అవని చతుర్వేది:

అవని చతుర్వేది మధ్యప్రదేశ్ లోని సత్నా జిల్లాలో జన్మించారు. ఈమె విద్యాభ్యాసం మధ్యప్రదేశ్ లోని షాడోల్ జిల్లాలో కొనసాగింది. 2014లో రాజస్థాన్ లోని బనస్థలి యూనివర్సిటీ నుంచి బీటెక్ పూర్తి చేశారు. తన సోదరుడి ప్రోత్సాహంతో అవని ఇండియన్ ఎయిర్ పోర్స్ లో చేరారు.

బనస్థలి యూనివర్సిటీలోని ఫ్లయింగ్ క్లబ్ లోవిమానాలను నడిపారు. ఆ తరువాత 2016లో ఫైటర్ స్క్వాడ్రన్ లో చేరారు. 2020లో ఈమె నారీ శక్తి పురస్కారాన్ని అందుకున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News