కాలం మారుతున్న కొద్దీ వినియోగదారులు అభిరుచులు మారిపోతున్నాయి. ఒకప్పుడు ప్రయాణం చేయాలంటే కాళ్లనే నమ్ముకునేవారు. ఆ తరువాత కాస్త అభివృద్ధి చెందిన తరువాత సైకిల్ ను వాహనాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అయితే వ్యవసాయ పనుల కోసం ఎడ్లబండిని ఏర్పాటు చేసుకునేవారు. వ్యవసాయానికి సంబంధించిన ఎడ్ల బండి ఉన్న వాళ్లు ఒకప్పుడు ధనవంతుల కిందే బావించేవారు. ఇది కొద్ది మంది వద్ద మాత్రమే ఉండేది. అయితే వ్యవసాయ రంగంలోకి ట్రాక్టర్లు ప్రవేశించిన తరువాత ఎడ్లబండి కనుమరుగైపోయింది. కాలం మారుతున్న కొద్ది దీని నిర్వహణ చేయలేక చాలా మంది మూలన పడేశారు. కానీ ఇప్పుడు ఓ ఖరీదైన కారు కోసం ఎడ్లబండే దిక్కయింది. ఓ కారు ను కాపాడేందుకు ఎడ్ల బండి ముందుకు వచ్చింది. అందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
దేశంలో ఆర్థిక రాజధాని ముంబై. ఇక్కడ పేదవారితో పాటు ఖరీదైన వ్యక్తులు కూడా ఉంటారు. అయితే ఇటీవల ముంబై రాయ్ గఢ్ లోని రేవ్ దండా బీచ్ కు ఇద్దరు యువకులు ఫెరారీ కారులో వచ్చారు. ఈ కారు అనుకోకుండా ఇసుకలో కూరుకుపోయింది. దీంతో అక్కడున్నవారంతా కారును బయటకు లాగేందుకు తీవ్రంగా ప్రయత్నించాలి. కానీ ఎంతకీ సాధ్యం కాలేదు.
అయితే ఇదే సమయంలో అటువైపు వెళ్తున్న ఎడ్లబండి సాయంతో కారును బయటకు లాగే ప్రయత్నం చేశారు. కారుకు తాడు కట్టి ఎడ్ల బండి సాయంతో లాగడంతో కారు బయటకు వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాలం ఎంత అభివృద్ధి చెందుతున్నా.. కొన్ని పురాతన వస్తువులు చాలా ఉపయోగపడుతాయని కొందరు వీడియో కింద కామెంట్ చేస్తున్నారు. వ్యవసాయ పనుల్లో రైతులకు అండగా ఉండే ఇవి ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో ఉన్నాయి. అయితే ట్రాక్లర్లు అందుబాటులోకి వచ్చిన తరువాత..పశువులకు గ్రాసం కొరవవడంతో ఎడ్లబండిని మూలన పడేశారు.