డిసెంబర్ నెల ప్రారంభం కాగానే క్రిస్మస్ సందడి ప్రారంభం అవుతుంది. ఈనెలలో 25న ఏసు క్రీస్తను కొలుస్తూ క్రిస్టియన్లు వేడుకలు నిర్వహించుకుంటారు. ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించే క్రిస్మస్ వేడుకల్లో భాగంగా తెలుగు రాష్ట్రాల్లోని వారు సైతం ఇందులో పాల్గొంటారు. ఈ సారి తెలంగాణ ప్రభుత్వం క్రిస్మస్ సందర్భంగా మూడు రోజులు సెలవులు కూడా ప్రకటించింది. ఇందులో 24, 25న క్రిస్మస్ వేడుకలు నిర్వహించుకుటారు. 26న బాక్సింగ్ డే ను నిర్వహిస్తారు. క్రిస్మస్ వేడుకలు ఎలా ఉంటాయో చాలా మందికి తెలుసు. కానీ బాక్సింగ్ డే అంటే ఏమిటి? దీనిని క్రిస్మస్ డే తరువాత రోజునే ఎందుకు నిర్వహించుకుంటారు? అసలు ఇది ఎలా ప్రారంభం అయింది? ఆ వివరాల్లోకి వెళితె..
క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 24, 25న ఏసుక్రీస్తును కొలుస్తూ ప్రత్యేకంగా ప్రార్థనలు చేస్తారు. ఇదే రోజు కేక్ కట్ చేసి ఒకరినొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటారు. బంధువుల ఇళ్లల్లోకి వెళ్లి ఆనందంగా గడుపుతారు. క్రిస్మస్ తరువాత వచ్చే బాక్సింగ్ డే పై చాలా మందికి అయోమయంగా ఉంది. సాధారణంగా బాక్సింగ్ అనగానే ఏదైనా క్రీడకు సంబంధించిన రోజు అని అనుకుంటారు. కానీ బాక్సింగ్ డే అంటే గిప్ట్ లను అందించే బాక్సులను బాక్సింగ్ డేగా పిలుచుకుంటారు. క్రిస్మస్ తరువాత కొందరు బహుమతులు ఇవ్వడం ఆనవాయితీ. ఇది ఈరోజున జరుపుకుంటారు. అయితే బాక్సింగ్ డే ఎక్కడ ప్రారంభం అయిందంటే?
1800 సంవత్సరంలో క్విన్ విక్టోరియా కాలం నుంచి బాక్సింగ్ డే ను నిర్వహిస్తున్నారు. ఇంగ్లాండ్ క్రిస్మస్ రోజున వేడుకలను నిర్వహించిన తరువాత వారి సేవకులకు బహుమతులు అందించారు. అయితే ఈ బహుమతులను సాధారణంగా కాకుండా ఒక బాక్సులో ఉంచి, దానిని ఆకర్షణీయంగా తయారు చేసి వారికి అందించారు. ఇలా ఇవ్వడ వల్ల వారిలో ఎంతో సంతోషాన్ని నింపింది. అలా అప్పటి నంచి ప్రతి క్రిస్మస్ తరువాత రోజున బాక్సింగ్ డే ను నిర్వహించుకుంటూ వస్తున్నారు.
1871 సంవత్సంలో బాక్సింగ్ డేను అధికారికంగా చేయబడింది. ముందుగా స్కాట్లాండ్, ఐర్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా వంటి దేశాల్లో బాక్సింగ్ డేను నిర్వహించారు. ఆ తరువాత ప్రపంచంలోని చాలా దేశాల్లో దీనిని నిర్వహించుకుటున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ బాక్సింగ్ డే కు ప్రత్యకంగా సెలవును ప్రకటిస్తున్నారు.
ఇదిలా ఉండగా బాక్సింగ్ డేను నేటి కాలంలో మరో రకంగా జరుపుకుంటారు. ఈరోజు ప్రత్యేకంగా లీగ్ మ్యాచ్ లు ఏర్పాటు చేసి ఆనందంగా ఉంటున్నారు. ఇదే రోజు పుట్ బాల్, రగ్బీ, క్రికెట్,గుర్రపు పందాలు వంటివి నిర్వహించుకుంటున్నారు. ఈ ఏడాది కూడా భారత్, ఆస్ట్రేలియా మధ్య బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ని నిర్వహిస్తున్నారు. డిసెంబర్ 26న భారత్, ఆస్ట్రేలియా మధ్య మెల్ బోర్న్ లో బాక్సింగ్ డే సందర్భంగా నాలుగో టెస్ట్ సాగనుంది. ఈ టెస్ట్ కు టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి.