హైదరాబాద్ లో వర్షం పడుతుందంటే నగరవాసులు భయపడిపోతుంటారు. ఎందుకంటే వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరుతుంది. రోడ్లపైకి భారీగా వరద వచ్చి ప్రయాణానికి కష్టం అవుతుంది. ఈ సమస్య పరిష్కారం ఎన్నో ప్రయోగాలు చేసినా ఫలితాలు ఇవ్వడం లేదు. దీంతో తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ లో వర్షం పడిన సమయంలో రోడ్లపై నీరు నిల్వకుండా, ట్రాఫిక్ సమస్య తీర్చడానికి రికొత్త ఐడియాను అధికారులు అమలు చేయబోతున్నారు. అదేంటంటే?
హైదరాబాద్ లో వర్షం పడినా ఇక నుంచి చుక్క నీరు కూడా నిలవదు. ఈ నీరంతా సంపుల్లోకి వెళ్తుంది. హైదరాబాద్లో వరదనీరు సమస్య తీర్చడానికి ప్రభుత్వం సంపుల నిర్మాణానికి శ్రీకారం చుట్టనుంది. నగరంలోని 12 ప్రాంతాల్లో భారీ సంపులను నిర్మించనునన్నారు. ఇవి ఒక్కోటి లక్ష వేల లీటర్ల సామర్థ్యంతో ఉండనున్నాయి.ఇప్పటికే నాలుగు పంపుల నిర్మాణం పూర్తయింది. వీటిలో సెక్రటేరియట్ ఎదురుగా 1.94 కోటలతో ఆరు లక్షల కపాసిటీ ఉన్న పంపు నిర్మాణం పూర్తి చేశారు. అలాగే మరో మూడు కూడా పూర్తయ్యాయి.
ఇవి ఉపయోగంలోకి వస్తే మరికొన్నింటి నిర్మాణం చేపడుతారు. అయితే ఇప్పటి వరకు ప్రారంభం అయిన వాటిని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. ఈ సంపులతో వర్షం పడిన నీరంతా ఈ సంపుల్లోకి వెళ్లి ఆ తరువాత కాలువల ద్వారా బయటకు వెళ్తాయి. ఆ తరువాత ఎక్కడా నీరు నిల్వకుండా ఉంటుంది. దీని వల్ల ట్రాఫిక్ సమస్యలు కూడా తొలగిపోనున్నాయి. ఎందుకంటే వర్షం పడిన సందర్భంలో రోడ్లపై నీరు ఉండడంతో ప్రయాణానికి కష్టమవుతుంది. దీంతో సంపుల నిర్మాణంతో ఈ సమస్యకు పరిష్కారం కానున్నాయి.