సామాన్యులపై కేంద్ర ప్రభుత్వం భారం మోపేందుకు రెడీ అయింది. వంట నూనెలపై దిగుమతి సుంకం పెంచేందుకు సిద్ధమైంది. దీంతో కొన్నాళ్లుగా తక్కువ ధరలోనే ఉన్న ఆయిల్ రేట్లు ఒక్కసారిగా పెరగనున్నాయి. గతంలో రూ. 200 దాటిని వంట నూనె ప్రస్తుతం రూ.110తో విక్రయిస్తున్నారు. అయితే లేటేస్టుగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం వల్ల మరోసార వీటి ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. దీంతో వినియోగదారుల జేబులకు చిల్లులు పడే అవకాశం ఉంది. అయితే భారత్ కు ఏ దేశాల నుంచి వంటనూనె ఎక్కువగా దిగుమతి అవుతుంది? ఎంత శాతం దిగుమతి సుంకం పెంచారు?
ప్రతీ ఇంట్లో వంటనూనె నిత్యావసరం. ఇది లేకుండా ఆహార పదార్థాలు వండలేరు. దీంతో వీటి ధరలు పెరగడం వల్ల సామాన్యులపై భారం పడే అవకాశం ఉంది. లేటేస్ట్ సమాచారం ప్రకారం సన్ ఫ్లవర్ ఆయిల్ పై 20 శాతం సుంకాన్ని పెంచారు. గతంలో రిఫైన్డ్ ఆయిల్ పై 12.5 శాతం వరకు ఉండేది. ఇప్పుడు మొత్తం కలిపి 32.5 శాతం దిగుమతి సుంకం ఉంటుంది. ఈ సుంకం సెప్టెంబర్ 14 నుంచే అమల్లోకి రానుంది.
ప్రస్తుతం మార్కెట్లో సన్ ఫ్లవర్ ఆయిల్ ఎంఆర్ పీ రూ.121 ఉండగా రూ.111.5 తో విక్రయిస్తున్నారు. దిగుమతి సుంకం పెరగడంతో వంట నూనె ధరలు పెరిగే అవకాశం ఉంది. అయితే ఎంత పెంచుతారనేది తెలియాల్సి ఉంది. దేశంలోకి వంట నూనెలు వివిధ దేశాల నుంచి వస్తుంటాయి. వీటిలో బ్రెజిల్, అర్జెంటీనా, రష్యా, ఉక్రెయిన్ నుంచి సన్ ఫ్లవర్, సోయా ఆయిల్ వస్తుంటుంది. మలేషియా, ఇండోనేషియా నుంచి పామ్ ఆయిల్ ను దిగముతి చేసుకుంటున్నారు. అయితే త్వరలో పామ్ ఆయిల్ దిగుమతులపై కూడా సుంకం పెరిగే అవకాశం ఉంది.