యువతకు ఆర్థిక భరోసా ఇచ్చి వారి ఆర్థికాభివృద్ధికి పాటుపడేలా తెలంగాణ ప్రభుత్వం కొత్త పథకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. అదే ‘రాజీవ్ యువ వికాసం. ఈ పథకం ద్వారా తెలంగాణకు చెందిన నిరుద్యోగులు, స్వయం ఉపాధి పొందాలని అనుకునేవారు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిబంధనలను అనుసరించి మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలంటే కులం సర్టిఫికెట్ తో పాటు ఆదాయం సర్టిఫికెట్ తప్పనిసరిగా చేశారు. అయితే తాజాగా తెల్ల రేషన్ కార్డు ఉంటే ఆదాయం సర్టిఫికెట్ ఉంటే ఆదాయం సర్టిఫికెట్ అవసరం లేదని అంటున్నారు. అదెలాగంటే?
తెలంగాణకు చెందిన ఎస్సీ, ఎస్టీ బీసీ విద్యార్థులు రాజు యువ వికాసం పథకం తీసుకోవడానికి అర్హులు. అలాగే వీరు 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలలోపు వయసు ఉండాలి. రాజీవ్ యువ వికాసానికి ఏప్రిల్ 2 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 6.2 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోంది. సొంతంగా వ్యాపారాలు ప్రారంభించడానికి వీరికి రుణాలు లక్షల వరకు ఆర్థిక సహాయాన్ని అందజేస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో వారైతే రూ.1,50,000ల వరకు ఆదాయాన్ని కలిగి ఉండాలి. పట్టణ ప్రాంతాలలోని వారు రూ.2 లక్షల వరకు వార్షికోత్సవం ఉండాలి.
మొన్నటి వరకు ఈ పథకానికి ఆదాయం సర్టిఫికెట్ తప్పనిసరిగా చేసింది ప్రభుత్వం. అలాగే కులం సర్టిఫికెట్ కూడా అవసరం ఉంటుంది. అయితే తెల్ల రేషన్ కార్డు ఉంటే ఆదాయం సర్టిఫికెట్ అవసరం లేదని తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా ఆన్ లైన్ అప్లికేషన్ ఫాంలో సైతం ఆదాయం సర్టిఫికెట్ తప్పనిసరి అనే మార్క్ ను తీసేశారు. ఆదాయం సర్టిఫికెట్ కోసం ఇప్పటికే చాలామంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఇవి రావడానికి ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. దీంతో తాము రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు చేసుకోలేము అని ఆందోళన చెందిన తరువాత ఈ అవకాశాన్ని కల్పించింది.