Tuesday, June 24, 2025

కార్తీక పౌర్ణమి రోజున నదీ స్నానం ఎందుకు చేయాలి?

పరమ పవిత్రమైన కార్తక మాసంలో ప్రత్యేక పూజలు చేయడం వల్ల అన్న శుభాలే జరుగుతాయని భక్తుల నమ్మకం. ముఖ్యంగా ఈ మాసంలో దీపాలు వెలిగించడం వల్ల కష్టాలన్నీ తీరుతాయని అంటారు. ఈ నేపథ్యంలో కొందరు మాసమంతా దీపాలు పెడుతూ ఉంటారు. కార్తీక పౌర్ణమికి 5 రోజుల ముందు దీపాలు వెలిగించడ వల్ల మరిన్ని ప్రయోజనాలు ఉంటాయని చెబుతూ ఉంటారు. ఇదే రోజు తులసి కల్యాణం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. అయితే కార్తీక మాసంలో గంగా స్నానం చేయాలని అంటారు. అసలు ఈ మాసంలో నదీ స్నానం చేయడం వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయి? గంగా స్నానం చేయడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి? ఆ వివరాల్లోకి వెళితే..

చలికాలం ప్రారంభం అయిన తరువాత నవంబర్ లో కార్తీక మాసం ప్రారంభం అవుతుంది. ఈ ఏడాదిలో కార్తీక మాసం నవంబర్ 2న ప్రారంభం అయింది. డిసెంబర్ 1న అమావాస్యతో కార్తీక మాసం పూర్తవుతుంది. అయితే కార్తీక మాసంలో శివకేశవులిద్దరినీ పూజిస్తారు. 15 రోజుల పాటు శివుడిని, మరో 15 రోజుల పాటు కేశవుడిని పూజిస్తారని పండితులు చెబుతున్నారు. ఈ సమయంలో పుణ్య క్షేత్రాలను దర్శిస్తుంటారు. సమీపంలోని నదీ స్నానం చేస్తారు.

కార్తీక మాసంలో నదీ స్నానం చేయడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజున నారాయణుడు మత్స్య అవతారం ఎత్తుతాడట. ఈరోజు నదీ స్నానం చేయడం వల్ల మనసు ప్రశాంతంగా మారుతుంది. సంపదలు మొదలవుతాయి. సనాతన ధర్మంలో నదీ స్నానానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. దీంతో ఈ రోజు నదీ స్నానం చేయడం వల్ల గతంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి. ఈరోజు స్నానం చేస్తూ సూర్యుడిని పూజించడం వల్ల అన్నీ శుభాలే జరుగుతాయిని చెబుతున్నారు. అలాగే కార్తీక పౌర్ణమి రోజున నదీ స్నానం చేసిన తరువాత నదిలో దీపాన్ని వదలాలి. ఇలా చేయడం వల్ల ఎంతో పుణ్యం దక్కుతుంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News