ప్రస్తుతం వర్షాకాలం. జ్వరాలు విజృంభిస్తున్నాయి. డెంగ్యూ, మలేరియా, టైపాయిడ్ బారిన పడి ఆసుపత్రుల పాలవుతన్నవారు ఎంతో మంది. అయితే పరిశుభ్రమైన వాతావరణంతో ఇలాంటి వాటికి దూరంగా ఉండొచ్చని ప్రభుత్వాలు ప్రచారం చేస్తున్నాయి. ఇందులో భాగంగ స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని కూడా ప్రవేశపెట్టారు. కొన్ని రాష్ట్రాల్లో ప్రతీ శుక్రవారం డ్రై డే పేరిట నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఇది పటిష్టంగా లేదని కొందరి వాదన. పైపైనే చర్యలు తీసుకోవడం తప్ప పరిశుభ్రమైన వాతావరణం కోసం తీవ్రంగా కృషి చేయాలని పిలుపులు ఇస్తున్నా పట్టించుకోవడం లేదు. అయితే ఇది ఏ అధికారులో, పాలకులో చెబితే కాదు.. ప్రజల్లోనే స్వచ్ఛదనం కోసం మార్పులు రావాలి. ఎవరికి వారు పరిశుభ్రమైన వాతావరణం ఏర్పాటు చేసుకోవాలి. అందుకు ఉదాహరణే ‘ఇండోర్’ సిటీ. వరుగసా 7వ సారి ఇండోర్ క్లీన్ సిటీగా అవార్డు దక్కించుకుంది. అందుకు అక్కడ తీసుకుంటున్న చర్యలేంటి?
ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా తన ఎక్స్ ఖాతాలో ఇలా అన్నాడు.. తాను ప్రశాంత వాతావరణం కోరుకోవాలని అనుకున్నప్పుడు తన ఫ్యామిలీతో కలిసి ఇండోర్ కు వెళ్తాడట. ఎందుకంటే అక్కడున్న స్వచ్ఛమైన వాతావరణం ఆహ్లాదాన్ని ఇవ్వడమే కాకుండా ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. ఇండోర్ చరిత్ర లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ 16వ శతాబ్దంలో డెక్కన్, ఢిల్లీ మధ్య వ్యాపార కేంద్రంగా ఏర్పడింది. ఇది కాన్హ్, సరస్వతి నది ఒడ్డున ఉంటుంది. 1724లో పేష్వా బాజీరావు దీనిని మరాఠా సామ్రాజ్యం కిందకు మార్చారు. ఆ తరువాత 1732 జూలై 29న ఇండోర్ నగరంగా ఏర్పడింది. బాజీరావు పేష్వా -128 ఇతర నగరాలను కలుపుతూ ‘మల్హర్రావు హెల్కర్’కు దీనిని అందించాడు.

మధ్యప్రదేశ్ లోని ఇండోర్ ప్రముఖ వ్యాపార కేంద్రంగా కొనసాగుతోంది. సాధారణంగా ఫ్యాక్టరీలు, సంస్థలు ఎక్కువగా ఉన్న చోట పర్యావరణం దెబ్బతింటుంది. కానీ ఇండోర్ నగరం మాత్రం క్లీన్ గా కనిపిస్తుంది. ఇందులో భాగంగా వరుసగా ఏడుసార్లు క్లీన్ సిటీ అవార్డును గెలుచుకుంది. గత జనవరి లో రాష్ట్రతి ముర్ము ఈ అవార్డును గెలుచుకోవడంపై ఆసక్తి నెలకొంది. ఇక్కడ క్లీన్ సిటీగా ఉండడానికి కారణమేంటి? అనే చర్చ సాగుతోంది.

ఇండోర్ సిటీ క్లీన్ గా ఉండడానికి ప్రధాన కారణం ఇక్కడి చెత్తను రీసైకిల్ చేయడం. ఓ కేస్ స్టడీ ప్రకారం ఇండోర్ లో 3.2 మిలియన్ల జనాభా ఉంది. ఇక్కడ ప్రతిరోజూ దాదాు 1,100 మెట్రిక్ టన్నుల వ్యర్థాన్ని సేకరిస్తారు. అలాగే ప్రతిరోజూ 1900 టన్నుల చెత్తనుప్రాసెస్ చేస్తారు. దీని వల్ల చెత్త తిరిగి ఉపయోగపడి కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతుంది. చెత్తను సేకరించిన తరువాత పొడి, తడి గా వేరు చేసి ప్రాసెస్ చేస్తారు. ఇక్కడ చెత్తను సేకరించడానికి వివిధ వర్గాలుగా విభజిస్తారు. ఇంటి నుంచి చెత్తను సేకరించడం మొదలు ప్రాసెస్ చేసేవారందరూ తమ విధులను సక్రమంగా నిర్వహిస్తారు. ప్రపంచ నివేదిక ప్రకారం ప్రతీ వ్యక్తి సగటున 0.74 కిలోగ్రాముల వ్యర్థాలను ఉత్పత్తి చేస్తారు. ఇది 2050 నాటికి పెరుగుతుందని అంచనా. ఇండోర్ క్లీన్ సిటీ మాత్రమే కాకుండా గ్రీన్ సిటీగా మారింది. ఇక్కడ ‘స్వచ్ఛ భారత్’లో భాగంగా 51 లక్షల చెట్లు నాటాలని నిర్ణయించారు. ఇప్పటికే ఆ ప్రక్రియ మొదలుపెట్టారు.
ఇండోర్ లా మిగతా సీటిలు ఎందుకు లేవు? అన్న ప్రశ్న సోషల్ మీడియాలో ఎదురవుతుంది. అయితే చెత్తను ప్రాసెస్ చేసే కేంద్రాలు ఏర్పాటు చేయడం వల్లే ఇది సాధ్యమవుతుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రతి ఒక్కరిలో శుభ్రమైన వాతావరణం గురించి అవగాహన ఉంటే భారత్ లో ప్రతీ సిటీ ఇండోర్ గా మారడం పెద్ద కష్టమేమీ కాదని పర్యావరణ నిపుణులు పేర్కొంటున్నారు.