ఇండియా దిగ్గజ వ్యాపారవేత్త రతన్ టాటా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. ఆయన లేడన్న విషయంలో వ్యాపారుల్లో కలవరం పెడుతోంది. ఎన్నో విజయాలుసొంతం చేసుకున్న రతన్ టాటా తమ మనసులో ఎప్పటికీ గుర్తుండిపోతారని తోటి వ్యాపారులు, టాటా గ్రూప్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు అనుకుంటూ కన్నీళ్లు కారుస్తున్నారు. ఈ సందర్భంగా రతన్ టాటా గురించి ఆసక్తికర విషయంపై చర్చ సాగుతోంది. రతన్ టాటా వ్యాపారస్తుడిగా అసామాన్య విజయాలు సాధించారు. కానీ ఆయన పర్సనల్ లైఫ్ మాత్రం నిరాశగానే మిగిలిపోయింది. ఎందుకంటే ఆయన జీవితాంతం ఒంటరిగానే గడిపారు. ఎవరినీ పెళ్లి చేసుకోకుండా కేవలం వ్యాపారం పైనే దృష్టి పెట్టారు. అయితే రతన్ టాటా పెళ్లి చేసుకోకపోవడానికి బలమైన కారణం ఉంది. అదేంటంటే?
రతన్ టాటా 1937 డిసెంబర్ 28న జన్మించారు. ఈయనకు 13 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు. దీంతో ఆయనను తన అమ్మమ్మ పెంచి పెద్ద చేశారు. ఆ తరువాత ప్రాథమిక విద్యను ముంబైలో పూర్తి చేసి ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లారు. అక్కడ అర్కిటెక్చర్ లో గ్రాడ్యుయేషన్ పట్టా పొందారు. ఆ తరువాత జాబ్స్ లో చేశారు. అమెరికాలో రతన్ టాటా జాబ్ చేస్తున్న సమయంలో ఒక అమ్మాయితో ప్రేమలో పడ్డారు. దీంతో ఆమెతోనే జీవితం గడపాలని అనుకున్నారు. కానీ ఇంతలోనే తన అమ్మమ్మ అనారోగ్యానికి గురైనట్లు సమాచారం వచ్చింది.
ఈ తరుణంలో రతన్ టాటా ఇండియాకు తిరిగి రావాల్సి వచ్చింది. ఇదే సమయంల భారత్ చైనా మధ్య యుద్ధం నెలకొంది. ఇదే రతన్ టాటా లవ్ స్టోరీకి విలన్ లా మారింది. దీంతో చాలా రోజులు రతన్ టాటా ఇండియాలోనే ఉండిపోవాల్సి వచ్చింది. మరోవైపు ఆమె తన కోసం ఇండియాకు తిరిగి వస్తుందని ఎదురుచూశారు. కానీ రాలేదు. దీంతో ఇద్దరి మధ్య దూరం పెరిగిపోయింది. ఆ తరువాత ఎంతో కలత చెందిన ఆయన ఇక జీవితంలో ఎవరినీ పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నాడు. అయితే తన కోసం ప్రేయసిఇండియాకు రాకపోయినా తనపై ఎలాంటి కోపం లేదని రతన్ టాటా పలు ఇంటర్వ్యూల్లో పేర్కొన్నారు.
అయితే రతన్ టాటా బాలీవుడ్ నటి సిమి కారేవాల్ తోనూ ప్రేమలో పడ్డట్లు వార్తలు ఉన్నాయి.కానీ ఈ విషయాన్ని రతన్ టాటా ఎక్కడా ధ్రువీకరించలేదు. తన జీవితంలో ప్రేమ, పెళ్లి అచ్చిరావని భావించి పూర్తి సమయాన్ని వ్యాపారంపైనే దృష్టి పెట్టారు. దీంతో అసామాన్య విజయాలు సాధించి ప్రపంచ వ్యాపారుల్లో ఒకరిగా నిలిచారు. అంతేకాకుండా తక్కవ ధరలో భారతీయులకు ఎన్నో సేవలను అందించారు. తన కంపెనీ నుంచి రూ. లక్ష రూపాయల కారు తీసుకొచ్చి అందరినీ ఆశ్చర్యపరిచిన విషయం తెలిసిందే. మరికొన్ని రోజుల్లో లక్షన్నర కారు రాబోతుంది. కానీ ఇంతలోనే ఆయన లేకపోవడం బాధాకరమని పలువురు పేర్కొంటున్నారు.