హిందూ క్యాలెండర్ ప్రకారం కొన్ని శుభదినాలు తెలుగు నెలల ప్రకారం వస్తుంటాయి. ఆషాఢ మాసంలో సాధారణంగా ఎలాంటి శుభకార్యాలు ఉండవు. కానీ శుభదినాలు మాత్రం ఉంటాయి. వాటిలో గురు పౌర్ణమి ఒకటి. ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో వచ్చే పౌర్ణమిని గురు పౌర్ణమి అంటారు. భారత ఖండానికి వేద వ్యాసుడు మహాభారతం ద్వారా అపారమైన జ్ఞానాన్ని అందించాడు. అందుకు భక్తిగా ఆయన వేద వ్యాసుడి పుట్టిన రోజును గురు పౌర్ణమిగా భావిస్తూ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుంటాయి. ఒక వ్యక్తి జీవితంలో తల్లిదండ్రులతో పాటు గురువు కూడా చాలా ముఖ్యమే. అయితే గురువును మరిచిపోకుండా ఉండడానికి, తనకు జీవితాన్నిచ్చిన గురువును ఒక్కరోజైనా గుర్తు చేసుకోవాలని కొందరు అభిప్రాయ పడుతూ గురు పౌర్ణమి రోజున వేడుకలు నిర్వహంచుకుంటారు. అసలు గురు పౌర్ణమి రోజు ఏం చేస్తారంటే?
ఈ ఏడాది గురు పౌర్ణమి జూలై 20, 21 తేదీల్లో వస్తోంది. అయితే 20వ తేదీ సాయంత్రం పౌర్ణమి ప్రారంభం అవుతుంది. కానీ జూలై 21న సూర్యోదయం తరువాతే అసలైన రోజుగా భావిస్తాం. అందువల్ల జూలై 21న గురు పౌర్ణమి వేడుకలు నిర్వహించుకోవాలని అంటున్నారు. అయితే గురు పౌర్ణమిని రకరకాలుగా జరుపుకుంటారు. ఈరోజు తమ గురువుగా భావించే వ్యక్తిని ఇంటికి ఆహ్వానించి అతనికి మర్యాదలు చేయాలి. ఆ తరువాత తగిన బహుతిని ఇవ్వడం వల్ల గురుతర బాధ్యతను నిర్వహించినట్లువుతుందని పురాణాలు తెలుపుతున్నాయి.
గురు పౌర్ణమి రోజున కొందరు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈరోజున పసుపు, కుంకుమలతో అలంకరించిన లక్ష్మీనారాయణుడిని ప్రత్యేకంగా పూజిస్తారు. అష్తోత్తర శతనామాలు చదువుతూ ఉంటారు. గురు పరంపరను, శ్లోకాలను చదువుతారు. పసుపు రంగు గురువుకు ఇష్టం. అందువల్ల పసుపు రంగు, పసుపు పూలు అందించి పూజించాలి. ఈరోజు నారాయణుడిని స్వామి వత్ర విశేషంగా భావించి ప్రశాంతంగా ఉంటారు. ఇంట్లో వీలు కాకపోతే దగ్గర్లోని నారాయణుడి ఆలయానికి వెళ్లి స్వామి వారిని దర్శించుకుంటారు.
గురు పౌర్ణమి రోజున దానాలు చేయడం వల్ల ఎంతో పుణ్యఫలం వస్తుందని అంటారు. పేద బ్రహ్మణులకు పసుపు రంగు కలిగిన దుస్తులు దానం ఇవ్వాలంటారు. అలాగే అన్నదానం చేయడం వల్ల అఖండ ఐశ్వర్యం వస్తుందని చెబుతూ ఉంటారు.