ఇప్పుడంతా వ్యాధుల కాలంలా మారింది. వాతావరణంలో వస్తున్న మార్పులతో చాలా మంది ఏదో ఒక డిసీజ్ తో బాధపడుతున్నారు. ఈ తరుణంలో ఆరోగ్యంపై శ్రద్ధ ఉంచాల్సిన అవసరం ఉంది. ఇదే సమయంలో శరీరానికి ప్రోటీన్లు ఇచ్చేపదార్థాలను తీసుకోవాలి. మనం రోజూ చూసే.. మార్కెట్లో లభించే కొన్ని ప్రూట్స్ లో అనే పోషకాలు ఉంటాయి. కానీ వాటి గురించి పట్టించుకోం.
చిన్న వ్యాధి రాగానే లెక్కకు మించి టాబ్లెట్లను వేసుకుంటాం… అయతే మెడిసిన్ కంటే మనం తినే పండ్లలోనే అనేక వ్యాధి నివారణ పోషకాలు ఉన్నాయని కొందరు పెద్దవారు ఎంత చెబుతున్నా పట్టించుకోరు. కానీ వైద్య శాస్త్రవేత్తల పరిశోధన ప్రకారం వారు చెబుతున్నది నిజమేనని నిరూపించారు. అందులో ముఖ్యంగా బొప్పాయి… బొప్పాయితో అనేక వ్యాధులను హాస్పిటల్ కు వెళ్లకుండానే నయం చేసుకోవచ్చట. అవేంటో చూద్దాం..
బొప్పాయి.. దీనిని చూస్తే ఎవరికీ తినాలనిపించదు. కానీ ప్లేట్ లెట్స్ తగ్గినప్పుడు డాక్టర్ చెబితే మాత్రం పరిమితికి మించి తింటాం. ఆ తరువాత దీని గురించి పట్టించుకోం. అంతేకాకుండా ఒక బొప్పాయిని ఇష్టపడి తినేవారు సైతం ఆరెంజ్ కలర్ గుజ్జు మాత్రమే తింటారు. అందులో ఉన్న గింజలను బయట పడేస్తారు. కానీ ఆ గింజలతో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నాయని వైద్య పరిశోధకులు లేల్చారు.
2007లో నైజిరియాలో బొప్పాయి విత్తనాలపై ప్రయోగాలు చేశారు. ముఖ్యంగా పిల్లలపై పరిశోధించారు. ఇందులో భాగంగా 60 మంది పిల్లల మలాన్ని తీసుకొని పరిశీలించారు. మొత్తంగా బొప్పాయి విత్తానాలు తినడం వల్ల పిల్లల కడుపులో పురుగులను చంపేయవచ్చని తేల్చారు. దీంతో పిల్లల్లో మలబద్ధకం సమస్యను బొప్పాయి విత్తనాలు నివారిస్తాయని చెప్పారు.
అలాగే పెద్దవాళ్లలో కాలేయం శుభ్రపరచడానికి బొప్పాయి విత్తనాలు ఎంతో ఉపకరిస్తాయని అంటున్నారు. 15 రోజుల పాటు బొప్పాయి విత్తనాలు చూర్ణంచేసి వాటిని రసంగాలాగా చేసుకొని తాగితే ఫలితం ఉంటుందని అంటున్నారు. ఇక మూత్రపిండాల్లో రాళ్లు కరగడానికి బొప్పాయి మేలు చేస్తుందంటున్నారు వైద్యులు. కరాచీ విశ్వ విద్యాయంలో చేసిన పరిశోధనల్లో బొప్పాయి విత్తనాలు మూత్ర పిండాల వ్యాధులకు ఉపయోగపడుతాయని చెప్పారు.