మహా విష్ణు ఆనందానికి నిలయం అయితే.. ఉగ్రరూపానికి.. సమస్త లోకాన్ని నడిపించే దేవుడిగా శివుడిని పేర్కొంటారు. విష్ణువు దశావతారాలను ఎత్తారు. కాని శివుడు మాత్రం ఒకే రూపంలో కనిపిస్తారు. కానీ కాలభైరవుడిని గా పేర్కొనే స్వామి శివుని రూపంతో పోలి ఉంటాడు. అయితే కాలభైరవుడు ఎప్పుడూ ఆగ్రహంతో రగిలిపోతూ ఉంటాడు. కాలభైరవుడని ప్రత్యేకంగా పూజిస్తూ ఆలయాలను కట్టించారు. దేశంలో చాలా చోట్ల కాలభైరవుడి ఆలయాలు ఉన్నాయి. లోక క్షేత్ర పాలకుడిగా కాలభైరవుడైన పేర్కొంటారు. అయితే కాలభైరవుడు ఎవరు? శివుడికి కాలభైరవుడికి ఉన్న సంబంధం ఏంటి? ఆ వివరాల్లోకి వెళితే..
ఒకసారి ఋషులకు త్రిమూర్తుల్లో లోకానికి అధిపతి ఎవరో నన్ను సందేహం వచ్చింది. ఈ సమయంలో బ్రహ్మ తన ఐదు ముఖాలతో ఋషుల వైపు చూస్తూ తానే ఈ లోకానికి అధిపతి అని చెబుతాడు. ఈ లోకాన్ని సృష్టించిన వ్యక్తిని నేనేనని.. నేనే లోకాన్ని సంహరిస్తానని అంటాడు. అయితే విష్ణు సైతం లోకానికి అధిపతి నేనే అనడంతో ఇద్దరి మధ్య తగువు ఏర్పడుతుంది. అప్పుడు బ్రహ్మ తన అహంకారంతో చెలరేగిపోతాడు. ఇదే సమయంలో శివుడితో కూడా తానే ఈ లోకానికి అధిపతి అంటూ తగువు పెట్టుకుంటాడు. ఇదే సమయంలో శివుడు తన వెంట్రుకను తీసివేయగా కాలభైరవుడు ఉద్భవిస్తాడు. అచ్చం శివుడి రూపంతో ఉన్న కాలభైరవుడు ఉగ్రరూపంతో కనిపిస్తాడు. అయితే శివుడుతో తగువు పెట్టుకుంటున్న బ్రహ్మను చూసి కాలభైరవుడు బ్రహ్మ ఐదోతలను చిటికెన వేలుతో తీసేస్తాడు.

అప్పుడు బ్రహ్మ పశ్చాత్తాపం పడి తన అహంకారాన్ని వీడుతాడు. అయితే బ్రహ్మ బ్రాహ్మణుడు. బ్రాహ్మణ హత్య మహాపాపం. అందువల్ల బ్రహ్మ నుంచి తీసేసిన తల కాలభైరవుడి చేతితోనే ఉంటుంది. దీనిని తొలగించుకోవడానికి 12 ఏళ్ల పాటు లోకం మొత్తం తిరుగుతాడు. కానీ ఎక్కడికి వెళ్లినా కాలభైరవుడు చేతి నుంచి బ్రహ్మ తల వేరుగా కాకుండా ఉంటుంది. ఇదే సమయంలో విష్ణువు అనుగ్రహించి కాలభైరవుడికి అసలు చరిత్ర తెలుపుతాడు. నువ్వు శివ కుమారుడివి అందువల్ల కాశి క్షేత్రానికి వెళ్లి శివుడిని పూజించడం వల్ల సమస్య పరిష్కారం అవుతుందని తెలుపుతాడు. దీంతో కాశి క్షేత్రానికి వెళ్లగానే కాలభైరవుడి చేతి నుంచి బ్రహ్మ తల వేరు పడుతుంది. అలా కాలభైరవుడు కాశీ క్షేత్రంలో కొలువై ఉన్నారని పురాణాలను బట్టి తెలుస్తుంది.
అయితే కాలభైరవుడు క్షేత్రపాలకుడిగా పేర్కొంటారు. పాపులను, తప్పు చేసే వారిని శిక్షించేందుకు కాలభైరవుడు తన ఖడ్గంతో శివాలయాల్లో కనిపిస్తాడని అంటారు. కాలభైరవుడు శివాలయంలో మాత్రమే కాకుండా ప్రత్యేకంగా పూజలు అందుకుంటున్నాడు. దూర ప్రయాణాలు చేసేవారు, రాత్రిళ్ళు ప్రయాణాలు చేసేవారు కాలభైరవడిని స్మరించుకుంటూ వెళ్లడం వల్ల ఆ స్వామి కాపాడుతారని అంటారు. కాలభైరవాష్టకం చదవడం వల్ల కొన్ని దోషాల నుంచి విముక్తి పొందుతారని తెలుపుతారు. కాలభైరవుడు ఆలయాలతో పాటు అష్టాదశ శక్తి పీఠాలను కూడా కాపాడుతారని ఆధ్యాత్మిక శాస్త్రం తెలుపుతుంది.