Wednesday, June 25, 2025

ప్రధాని మోదీ పర్యటించిన ‘గిర్ అడవుల’ ప్రత్యేకత ఏంటి? ఇక్కడికి ఎలా వెళ్లాలి?

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవల గుజరాత్ లోని అడవుల్లో పర్యటించారు. ప్రత్యేకమైన డ్రెస్ లో ఆయన గుజరాత్ రాష్ట్రంలోని జనాగఢ్ జిల్లాలోని వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో పర్యటిస్తూ జంతువుల ఫోటోలను తీశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మార్చి 3న వన్యప్రాణుల సంరక్షణ దినోత్సవం సందర్భంగా ప్రధాని ఈ పర్యటన చేశారు. అయితే గుజరాత్ లోని గిర్ అడవుల ప్రత్యేకత ఏంటి?

గుజరాత్ రాష్ట్రంలోని జనాగఢ్ జిల్లాలో గిర్ అడువులు విస్తరించి ఉన్నాయి. 1965 సంవత్సరంలో సుమారు 1412 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో దీనిని వన్యప్రాణుల సంరక్షణ కేంద్రంగా ఏర్పాటు చేశారు. ఇది జునాగఢ్ పట్టణానికి 65 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గిర్ అడవులు ఆసియా ఖండంలోనే ప్రత్యేక అభయారణ్యంగా చెప్పుకుంటారు. ఎందుకంటే ఆసియా కు చెందిన సింహాలు ఇక్కడ నివసించి ఉంటాయి. అందుకే దీనిని సింహాల రక్షణ ప్రాంతంగా పేర్కొంటారు. భారతదేశానికి స్వాతంత్రం రాకముందే జునాగఢ్ నవాబు దీనిని సింహాల రక్షిత ప్రాంతంగా గుర్తించారు. అప్పటినుండి ప్రభుత్వం వివిధ సంస్థల ద్వారా దీనిని సంరక్షిస్తూ వస్తుంది. 2005 సంవత్సరపు లెక్కల ప్రకారం ఇందులో 359 సింహాలు ఉన్నాయి.

అలాగే ఇందులో అనేక రకాల వృక్షాజాతులు ఉన్నట్లు గుర్తించారు. 1955 సంవత్సరంలో గిర్ అభయారణ్యంలో సర్వే జరపగా 507 వృక్షజాతులను కనుగొన్నారు. ఇందులో డైసీ, డెసిడుయస్, టేకు ప్రధాన జాతులుగా ఉన్నాయి. పశ్చిమ భారతదేశంలోని అతిపెద్ద డైసీ అరణ్యంగా పేర్కొంటారు.ఈ అడవుల గుండా నదులు కూడా ప్రవహిస్తూ ఉంటాయి. మొత్తం 7 నదులు ఇక్కడ కనిపిస్తాయి. వాటిలో హిరన్, శత్రుంజి, దటర్డీ, శింగోడా, మచుంద్రి, ఘోడావరి, రావల్ ఉన్నాయి.

గిర్ అడవులకు ఎలా వెళ్లాలి?
గుజరాత్ లోని కేశోడ్ విమానాశ్రయానికి 160 కిలోమీటర్ల దూరంలో ఈ నేషనల్ పార్క్ కు వెళ్లొచ్చు. అలాగే రాజ్ కోట్ విమానాశ్రయం నుంచి రైలులో లేదా ఇతర వాహనాల ద్వారా 75 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. ట్రైన్ లేదా ప్రత్యేక వాహనాల ద్వారా అహ్మదాబాద్ కు వెళితే 410 కిలోమటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. అన్నింటి కంటే కేశోడ్ నుంచి త్వరగా వెళ్లొచ్చు. రైలు ద్వారా వెళ్లాలని అనుకునేవారు జునాఘడ్, డెల్వాడ, వెరావాల్ కు చేరుకోవచ్చు. ఇవి పూణె, త్రివేండ్రం నుంచి ప్రయాణిస్తాయి. ఇవి నేరుగా జునాఘడ్ లోనే ఆగుతాయి. ముంబై నుంచి సౌరాష్ట్ర మెయిల్, సౌజనతా రైళ్లు ఇక్కడికి చేరుకుంటాయి.

ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించిన సందర్భంగా మాట్లాడారు. వన్యప్రాణులను సంరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని అన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News