భారత్, పాకిస్థాన్ యుద్ధ నేపథ్యంలో పాకిస్థాన్ కు International Money Fund(IMF)ఆర్థిక సాయం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుత సమయంలో తమకు 1.3 బిలియన్ డాలర్లు కావాలని ఐఎంఎఫ్ ను కోరింది. అయితే భారత్ ఈ నిధులను వ్యతిరేకిస్తుంది. అసలు ఐఎంఎఫ్ అంటే ఏమిటి? ఇందులో భారత్ ఏ స్థానంలో ఉంది?
ప్రపంచ దేశాలకు ఆర్థిక స్థిరత్వాన్ని కల్పించేందుకు 1944లో హ్యార డెక్స్టర్ వైట్, జాన్ మేరార్డ్ కీన్స్ లు కలిసి దీనిని ఏర్పాటు చేయాలని అనుకున్నారు. ఇందులో భాగంగా 1945 డిసెంబర్ 27న 29 దేశాలతో కలిసి అధికారికంగా అంతర్జాతయీ ద్రవ్యనిధి సంస్థ(IMF)ను ఏర్పాటు చేశారు. 1946 చివరి నాటికి ఇందులో 39 దేశాలు సభ్యత్వం పొందాయి. ప్రస్తుతం 191 దేశాలు ఉన్నాయి. ఇందులో భారత్ వాటా 13,114.4 మిలియన్ డాలర్లు ఉండగా.. మొత్తంలో 2.75 వాటాను కలిగి ఉంది.
ఒక దేశం సంక్షోభం సమయంలో ఐఎంఎఫ్ నుంచి ఆర్థిక సాయం పొందవచ్చు. 1947 మే 8న మొట్టమొదటిసారిగా ప్రాన్స్ దేశం రుణం తీసుకుంది. 1945 సంత్సంలోనే భారత్ అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థలో సభ్యత్వం పొందింది. 1947లో అధికారిక కార్యకలాపాలను ప్రారంభించింది. అప్పటి నుంచే ఓటింగ్ తో కూడిన సభ్య దేశంగా మారింది. ఐఎంఎఫ్ లో ప్రతి సభ్య దేశం నుంచి ఒక గవర్నర్ ఉంటారు. వీరిలో ఆర్థిక మంత్రి కూడా ఉంటారు. ప్రస్తుతం ఐఎంఎఫ్ లో భారత్ నుంచి నిర్మలా సీతారామన్ గవర్నర్ గా ఉన్నారు. బోర్డ్ ఆఫ్ గవర్నర్లు సాధారణంగా ఏడాదికి ఒకసారి సమావేశం అవుతారు. సభ్యులు ఐఎంఎఫ్ లో తమ కోటా పెంచినప్పుడు ఓట్ల శాతం పెరుగుతుంది. ప్రస్తుతం భారత్ కు ఐఎంఎఫ్ లో 132,609 ఓట్లు ఉన్నాయి. అంటే మొత్తం ఫండ్ లో 2.64 శాతం వాటా ఉన్నట్లు తెలుస్తోంది.
పాకిస్థాన్ కు ఐఎంఎఫ్ సాయం నేపథ్యంలో భారత్ ఐఎంఎఫ్ ఓటింగ్ కు దూరంగా ఉంటామని చెబుతోంది. అయినా కూడా ఐఎంఎఫ్ 7 బిలియన్ల ఎక్స్ టెండెడ్ ఫండ్ ఫెసిలిటీ ప్రోగ్రామ్ ను ఆమోదించింది. అంటే ఇప్పటి వరకు తీసుకున్న 1 బిలియన్ తక్షణ రుణాన్ని వాయిదా వేస్తూ.. దీనికి తోడుగా కొత్తగా 1.3 బిలియన్ డాలర్ల రుణాన్ని అందించింది. దీంతో పాకిస్థాన్ ఐఎంఎఫ్ కు 2.3 బిలియన్ డాలర్లు అప్పు పడింది.