Tuesday, June 24, 2025

వినాయకుడి పూజలో ఉపయోగించే 21ఆకులు ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

ప్రతీ ఏడాది భాద్రపద మాసంలో వినాయక చవితి వస్తుంది. దాదాపు 10 రోజుల పాటు నిర్వహించే ఈ వేడుకల కోసం యువత, ఆధ్యాత్మిక వాదులు ఎదురుచూస్తూ ఉంటారు. ఈ ఏడాది సెప్టెంబర్ 7న వినాయక చవితి రాబోతుంది. అయితే ఇప్పటి కొందరు ఈ పండుగను ఏరోజు నిర్వహించుకోవాలి? అనే సందేహంలో పడుతున్నారు. ఎందుకంటే హిందూ క్యాలెండర్ ప్రకారం ఆగస్టు 6 శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు చతుర్థ తిథి ప్రారంభం అవుతుంది. మరుసటి రోజు అంటే సెప్టెంబర్ 7 శనివారం సాయంత్రం 5.35 గంటల వరకు కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం కంటే శనివారం వేడుకలు నిర్వహించుకోవడం మంచిదని అంటున్నారు. వినాయక చవిత సందర్భంగా మొదటి రోజు పూజ చేయడం ఎంతో మంచిది అని కొందరి భావన. గణనాథుడిని ప్రసన్నం చేసుకోవడానికి ముందే ఆయన పూజ చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని కొందరు ఆధ్యాత్మిక వాదులు చెబుతూ ఉంటారు. మిగతా పూజల కంటే వినాయకుడి పూజ ప్రత్యేకమైనది. ఈ పూజలు పూలు, పండ్లతో పాటు వివిధ రకాల పత్రాలు(ఆకులు) ఉపయోగిస్తారు. ఈ పత్రాలను వినాకుడికి సమర్పించడం వల్ల ఆ స్వామి సంతోషిస్తారు. అంతేకాకుండా ఈ ఆకులను పూజలు ఉపయోగించడం వల్ల భక్తులు అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారు. వినాయకుడి పూజలో ఉపయోగించే ఆ పత్రాలు ఏవి? వాటి వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి?

వినాయకుడి పూజలు మొత్తం 21 పత్రాలను ఉపయోగిస్తారు. ఇవి శాస్త్రీయతతో పాటు ఔషధాలను కలిగి ఉంటాయి. వాటిలో..

మాచీ పత్రం: వినాయకుని పూజలో మాచి పత్రాన్ని ఉపయోగిస్తారు. ఇది మంచి సువాసనను కలిగిస్తుంది. దీనిని ఉపయోగించి పూజలో పాల్గొన్న వారు దీని స్మెల్ ను పొందుతారు. ఈ కారణంగా వారి మనసు ఉల్లాసంగా మారుతంది. ఒత్తిడి ఉన్న వారికి అది దూరమవుతుంది. అంతేకాకుండా ఇది చర్మ వ్యాధులు రాకుండా కాపాడుతుంది.

ఉత్తరేణి: గణనాథుడి పూజలో ఉత్తరేణి ఆకును ఉపయోగిస్తారు. దీనిని వాడడం వల్ల దగ్గు, అస్తమా సమస్యలు నివారించబడుతాయి. కడుపునొప్పితో బాధపడేవారు సైతం దీని వాసన చూడడం వల్ల నయం అవుతుంది.

గరిక: గరిక సాధారణంగా ఎక్కడైనా కనిపిస్తుంది. కానీ దీనిని ప్రత్యేకంగా కొన్ని సందర్భాల్లో మాత్రమే వాడుతూ ఉంటారు. వినాయకుడి పూజలో గరిక మాల కూడా వేస్తుంటారు. ఇది రోగనిరోధక శక్తి పెంచుతుంది. దీనినే గుర్వార పత్రం అని కూడా అంటారు.

ఉమ్మెత్త: గ్రామాల్లో ఉమ్మెత్త పుష్పాలను చూస్తు ఉంటాం. దీనినే దత్తూర పత్రం అని అంటారు. దీనిని వినాయకుడి పూజలో వాడుతారు. దీనితో పూజ చేయడం వల్ల శ్వాస కోస సంబంధిత వ్యాధులు నయం అవుతాయి. అస్తమా నివారణలో ఇది ఉపయోగకరంగా ఉంటుంది.

ములక: ములకను బృహతీ పత్రం అని కూడా అంటారు. ఈ ఆకును పూజలో ఉపయోగించడం వల్ల ఉబ్బసం సమస్యలు పరిష్కారం అవుతాయి.

తులసి: తులసిని సాధారణంగా ఇతర పూజల్లో కూడా వాడుతూ ఉంటారు. వినాయకుడి పూజలో దీనిని ఉపయోగిస్తారు. తులసి ఆకుల వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇది వేడిని తగ్గిస్తుంది. శ్వాస కోస సంబంధిత వ్యాధులకు ఇది మంచి ఔషధం.

మారేడు: శివుడి పూజలో మారేడు లేదా బిల్వ పత్రాన్ని తప్పకుండా వాడుతూ ఉంటారు. దీనిని గణేశుడికి కూడా సమర్పిస్తారు. దీని వల్ల డయాబెటిస్ ఉన్న వారికి మంచి ఔషధంలా పనిచేస్తుంది. విరేచనాలు తగ్గాలంటే దీనిని నమిలితే పరిష్కారం అవుతుంది.

రేగు ఆకు: బదరీ పత్రం అని పిలిచే రేగు ఆకు గురించి అందరికీ తెలిసిందే. దీనిని గణనాథుడి పూజలో ఉపయోగిస్తారు. ఇది చర్మ సమస్యలను తగ్గించడానికి ఉపయోగపడుతుంది.

గన్నేరు: గన్నేరు ఆకును కరవీర పత్రం అనికూడా ఉంటారు. ఈ చెట్టు బెరడు కూడా మంచి ఔషధంలా పనిచేస్తుంది. శరీరంలో గాయాలు అయితే దీని ఆకు పసరు రాయడం వల్ల నయం అవుతుంది.

ధవనం: మరువక పత్రం అని కూడా పిలవబడే ఈ ఆకు మంచి సువాజన వెదజల్లుతుంది. దీంతో ఒత్తిడి నుంచి దూరమవుతారు.

మామిడి: మామిడి గురించి తెలియని వారుండరు. దీనిని ప్రతీ పూజలో ఉపయోగిస్తారు. ఈ ఆకు వల్ల లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మామిడి ఆకును నమలడం వల్ల చిగుళ్ల వాపు తగ్గుతుంది. దుర్వాసన సమస్య నుంచి కూడా బయటపడుతారు. మామిడి పుల్లతో దంతాలను తోముకుంటే దంతాలు గట్టిగా మారుతాయి.

షమీ: దసరా సమయంలో షమీ లేదా జమ్మి గురించి బాగా వింటుంటాం. ఈ ఆకులను వినాకుడి పూజలో ఉపయోగిస్తారు. వీటి వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి నోటి సమస్యలను దూరం చేస్తాయి.

వావిలాకు: కీళ్ల నొప్పుల సమస్యతో బాధపడేవారికి వావిలాకు మంచి ఔషధంలా పనిచేస్తుంది. వేడినీరు స్నానం చేసే సమయంలో ఈ ఆకును అందులో వేయడం వల్ల నొప్పులు ఉన్న వారు ఉపశమనం పొందుతారు. ఈ ఆకులను చూర్ణం చేసి నొప్పులు ఉన్న చోట వాడినా ఫలితం ఉంటుంది.

విష్ణుక్రాంత పత్రం: చర్మ సౌందర్యానికి విష్ణుపత్రం మంచి ఔషధంలా పనిచేస్తుంది. దీనిని వినాయకుడి పూజలో వాడుతారు.

రావి : రావి చెట్టు గురించి అందరికీ తెలిసిందే. ఈ ఆకును వినాయకుడి పూజలో వాడుతారు. చర్మ సమస్యలు ఉన్న వారు ఈ ఆకు చూర్ణం వాడడం వల్ల పరిష్కారం అవుతాయి.

దానిమ్మ: దానిమ్మ చెట్టును చాలా మంది ఇంట్లో పెంచుకుంటూ ఉంటారు. ఈ పత్రాలను వినాయకుడి పూజలో వాడుతూ ఉంటారు. ఈ ఆకుల వల్ల వాంతులు, విరేచనాలనుంచి బయటపడుతారు.

మద్ది: వినాయకుడి పూజలో మద్ది ఆకును వాడుతారు. దీనినే అర్జున పత్రం అని కూడా అంటారు. ఇది గుండె సమస్యలకు పరిష్కారాలుగా ఉంటాయి. ఈ పత్రాలు మెరుగైన రక్త ప్రసరణకు ఎంతో ఉపకరిస్తాయి.

జాజిమల్లి: వినాయకుడి పూజలో వాడే జాజిపత్రం వల్ల చర్మ సమస్యలు తొలగిపోతాయి.

గండలీ పత్రం: గండలీ పత్రాన్ని లతా దుర్వా అని కూడా అంటారు. అతి మూత్ర వ్యాధి ఉన్న వారు దీనిని ఉపయోగించడం వల్ల సమస్య పరిష్కారం అవుతుంది.

దేవదారుపత్రం: శరీరంలో వేడి ఎక్కువగా ఉన్న వారికి దేవదారు పత్రం మంచి ఔషధంలా పనిచేస్తుంది. ఇది ఎక్కడ ఉంటే అక్కడ స్వచ్ఛమైన గాలి ఉంటుంది.

జిల్లేడు: జిల్లేడును మరికొన్ని పూజల్లో కూడా వాడుతూ ఉంటారు. దీని వల్ల నరాల బలహీనత, చర్మ సమస్యల నుంచి బయటపడొచ్చు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News