Wednesday, June 25, 2025

విమాయంలో ప్రయాణం చేయాలనుకుంటున్నారా? ఎయిర్ ఇండియా బంఫర్ ఆఫర్.. రూ.2వేల లోపే టికెట్..

ఫ్లైట్ ఎక్కాలని చాలా మందికి కోరిక ఉంటుంది. అయితే దీని ఛార్జీలు అధికంగా ఉంటాయి. దీంతో చాలా మంది అటువైపు చూడరు. కానీ ప్రస్తుత కాలంలో ధర కాస్త ఎక్కువైనా ఒక్కసారైనా ఆ అనుభవం పొందుతున్నారు. అయితే ఇప్పుడు ప్రముఖ విమానయాన సంస్థ Air India బంఫర్ ఆఫర్ ప్రకటించింది. దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు విదేశాలకు వెళ్లేవారికి ఈ ఆఫర్ వర్తిస్తుంది. అయితే ఈ ఆఫర్ ప్రత్యేక కేటగిరీ వారికి మాత్రమే వర్తిస్తుంది. ఆ వివరాల్లోకి వెళితే..

Air India ‘ప్రీడమ్ సేల్’ పేరుతో ప్రయాణికులకు ఆఫర్ ప్రకటించింది. ఇండిపెండెన్స్ డే సందర్భంగా 32 రూట్లలో తక్కువ ధరకే విమానంలో ప్రయాణం చేసే సౌకర్యాన్ని కల్పించింది. దేశీయ రూట్లు ఢిల్లీ నుంచి గ్వాలియర్, బెంగుళూరు నుంచి గోవా, ఢిల్లీ నుంచి జైపూర్ తో సహా మొత్తం 32 రూట్లు ఈ ఆపర్ కిందికి వస్తాయి. అలాగే ఇంటర్నేషనల్ లో 32 దేశాలకు ప్రయాణం చేసేవారికి ఇది వర్తిస్తుంది.

అయితే ఈ ఆఫర్ ప్రత్యేక కేటగిరీ వ్యక్తులకు మాత్రమే వర్తిస్తుంది. అంటే స్టూడెంట్స్, వృద్ధులు, నర్సులు, వైద్యులు, సాయుధ దళాల సిబ్బంది వారు ఈ ఆఫర్ ను పొందవచ్చు.ఈ ఆఫర్ కింద సంబంధిత రూట్లలో కేవలం రూ. 1947 చెల్లిస్తే సరిపోతుంది. వీటితో పాటు అదనంగా 3 కిలోల లగేజీని బుక్ చేసుకునే అవకాశం కల్పించారు. పూర్తి వివరాల కోసం, టికెట్ల కోసం airindiaexpress.comలో సంప్రదించవచ్చని తెలిపింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News