Wednesday, June 25, 2025

ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు ఇక లేరు..

ఈనాడు సంస్థల అధినేత, ప్రముఖ పారిశ్రామిక వేత్త రామోజీరావు శనివారం ఉదయం కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. జూన్ 7న తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో హైదరాబాద్ లోని ప్రైవేట్ ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. ఇటీవలే ఆయన గుండెకు స్టంట్ వేసి ఆపరేషన్ చేశారు. రామోజీరావు 1936 నవంబర్ 16న సాధారణ రైతు కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి వెంకట సుబ్బారావు, తల్లి వెంకట సుబ్బమ్మ. వీరిది కృష్ణా జిల్లాలోని పెదపారుమూడి.

చదువు పూర్తి చేసుకున్న తరువాత రామోజీరావు ముందుగా తహశిల రామచంద్రరావు ప్రోత్సాహంతో అడ్వర్టయిజ్మెంట్ ఏజెన్సీలో పనిచేశారు. ఆ తరువాత హైదరాబాద్ కు తిరిగి వచ్చి 1962లో మార్గదర్శి చిట్ ఫండ్ ను ప్రారంభించాడు. ఇదే అతని జీవితంలో మొదటి వ్యాపారం. ఆ తరువాత 1969లో అన్నదాత అనే పత్రికను ప్రారంభించాడు. ఆ తరువాత 1970లో ఈనాడు పత్రికును స్థాపించాడు. రామోజీరావు గ్రూపు కింద ఈనాడు, సితార, అన్నదాత, చతుర, విపుల, తెలుగు వెలుగు, బాల భారతం వంటి వి ఉన్నాయి. వీటిలో కొన్ని మూత పడ్డాయి. ఈటీవీ పలు భాషల్లో రన్ అవుతోంది.

పత్రికలే కాకుండా రామోజీరావు పలు సినిమాలను నిర్మించాడు. 1984లో మొదటిసారిగా శ్రీవారికి ప్రేమలేఖను నిర్మించారు. చివరిగా నిన్ను కలిశాక కు నిర్మాతగా వ్యవహరించారు. రామోజీ రావు చేసిన సేవలకు పలు పురస్కారాలు అందుకున్నాడు. ఆంధ్ర విశ్వ విద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ పొదారు. 2016లో ఆయనను కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషన్ తో సత్కరించింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News