క్రీడాభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న భారత్, పాకిస్తాన్ మ్యాచ్ జరిగే రోజు రానే వచ్చింది. జూన్ 9న ఆదివారం అమెరికాలోని న్యూయార్క్ లో బిగ్ ఫైట్ సాగనుంది. రెండేళ్ల తరువాత దాయాది పోరు ఉండడంతో అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. టీ 20 వరల్డ్ కప్ లో భాగంగా జరిగే ఈ మ్యాచ్ భారత కాలమాన ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభం అవుతుంది. ఇప్పటికే భారత్ ఐర్లాండ్ పై విజయంతో ఉత్సాహంగా ఉంది. పాకిస్తాన్ మాత్రం కొత్తగా ఫీల్డులోకి వచ్చిన అమెరికా చేతిలో ఓడిపోయి నిరాశతో ఉంది. ఈ క్రమంలో ఆదివారం జరిగే మ్యాచ్ లో భారత్ ఓడిపోతే పాకిస్తాన్ వరల్డ్ కప్ నుంచి తొలగిపోతుందా? అనే చర్చ సాగుతోంది. అదెలాగంటే?
టీ20 వరల్డ్ కప్ ఎంట్రీ మ్యాచ్ లోనే పాకిస్తాన్ పేవలంగా ఆడింది. అమెరికాతో జరిగిన మ్యాచ్ లో ఓడిపోవడంతో బలమైన భారత్ పై వీరి ప్రదర్శన ఎలా ఉంటుందోనన్న ఆసక్తి నెలకొంది. వన్డే వరల్డ్ కల్ లో ఫైనల్ వరకు వెళ్లిన భారత్ ఈసారి ఏమాత్రం చాన్స్ మిస్ చేసుకోవద్దన్న ఆలోచనతో ఉంది. దీంతో దీంతో భారత్, పాకిస్తాన్ జరిగే మ్యాచ్ లో ఎలాగైనా గెలవాన్న కసితో భారత్ ఉంది. అటు పాకిస్తాన్ సైతం అదే ఊపులో ఉంది. అయితే నేడు జరిగే మ్యాచ్ లో ఒకవేళ భారత్ ఓడిపోతే పాక్ వరల్డ్ కప్ టోర్నీ నుంచి బయటకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది.
న్యూయార్క్ లో జరిగే మ్యాచ్ లో భారత్, పాకిస్తాన్ ను ఓడించినట్లయితే పాక్ 2 పాయింట్లను కలిగి ఉంటుంది. భారత్ కు 4 పాయింట్లు వస్తాయి. అయితే ఆ తరువాత పాకిస్తాన్ తో కెనడా, ఐర్లాండ్ మ్యాచ్ లు జరుతాయి. ఈ రెండు మ్యాచుల్లోనూ పాక్ తప్పనిసరిగా గెలవాల్సి ఉంటుంది. ఇదే సమయంలో అమెరికా లేదా భారత్ చెరో రెండు మ్యాచుల్లో ఓడిపోతే పాక్ కు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలా కాకుండా భారత్ జూన్ 9న జరిగే మ్యాచ్ లో ఓడిపోయినా ఆ తరువాత జరిగే మ్యాచుల్లో ఒక్కటి గెలిచినా.. లేదా అమెరికా ఆ తరువాత జరిగే మ్యాచుల్లో ఒక్కటి గెలిసినా పాకిస్తాన్ వరల్డ్ కప్ టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి ఉంటుంది. పాకిస్తాన్ తో మ్యాచ్ తరువాత భారత్ కెనడాతో తలపడనుంది.