ప్రేమ కోసం ప్రాణాలు ఇచ్చే వారిని చూశాం.. ప్రేమ కోసం పగలు, ప్రతీకారాలు పెంచుకునే వాళ్ళని చూశాం.. ప్రేమ కోసం యుద్ధాలు అయిన సంఘటనల గురించి విన్నాం.. అయితే ప్రేమ కోసం పిడకలతో కొట్టుకునే సాంప్రదాయం కూడా ఉంది. అదీ మన తెలుగు రాష్ట్రంలోనే. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఈ ఆచారం చాలా విచిత్రంగా ఉంటుంది. ప్రేమ కారణంగానే రెండు వర్గాల మధ్య పిడకల సమరం జరుగుతూ ఉంటుంది. ఈ సమరంలో కొందరికి గాయాలు కూడా అవుతూ ఉంటాయి. ప్రతి ఉగాదికి నిర్వహించే ఈ పిడకల సమరంను ఇటీవల ఉగాదికి కూడా నిర్వహించారు. అయితే ఈ పిడకల సమరంలో ఎందుకు నిర్వహిస్తారు? దీనికున్న చరిత్ర ఏమిటి?
ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా అస్పరి మండలంలో ఉన్న కౌరుప్పల గ్రామం ప్రతి ఉగాది సందర్భంగా పిడకల సమరంతో ఆందోళన వాతావరణం నెలకొంటుంది. అయితే ఈ ఆందోళన రెండు వర్గాలు ఇష్టపూర్వకంగానే ఉంటుంది. అంటే ఆచారంలో భాగంగానే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ సమరంలో భాగంగా కారుమంచి అనే గ్రామం నుంచి పెద్దరెడ్డి వంశస్తుడైన నందకిషోర్ రెడ్డి గుర్రంపై కైరుప్పల గ్రామంలో ఉన్న ఆలయానికి వస్తారు. ఆ తర్వాత పూజలు చేసి తిరిగి వెళ్లిపోయిన తర్వాత రెండు వర్గాల మధ్య పిడకల దాడి జరుగుతుంది.

పిడకల సమరంనకు ఒక చరిత్ర ఉందని గ్రామస్తులు తెలుపుతున్నారు. కాళికామాత, వీరభద్ర స్వామి ప్రేమలో పడతారు. అయితే పెళ్లి విషయంలో వీరభద్ర స్వామి ఆలస్యం చేస్తాడు. కాళికామాతను పెళ్లి చేసుకోకుండా ఉండడంతో.. ఆ దేవిని వీరభద్రుడు మోసం చేశారని భావించి కాళికామాత తరఫున భక్తులు ఆవు పేడతో తయారుచేసిన పిడకలను వీరభద్ర స్వామిపై వేయడానికి రెడీ అవుతారు. అయితే ఇదే సమయంలో వీరభద్రస్వామి వర్గీయులు స్వామికి ఆ విషయం చెబుతారు. కానీ వీరభద్రస్వామి అటువైపు వెళ్తారు. కానీ ఈ దాడిని ఎదుర్కోవడానికి వీరభద్రస్వామి భక్తులు సైతం పిడకలను తీసుకొస్తారు. ఇలా రెండు వర్గాల మధ్య పిడకల సమరం ప్రారంభమైందని అంటున్నారు.
పిడకల సమరంలో భాగంగా కొందరికి గాయాలు అవుతాయి. అయినా వారు ఆలయంలోకి వెళ్లి విభూతిని ధరించడం వల్ల ఆ గాయాలు త్వరగా మానిపోతాయని అంటున్నారు. అంతేకాకుండా ఈ గాయం కొన్ని రోజుల్లోనే మారిపోతుందని తెలుపుతున్నారు. 2025 మార్చి 30న జరిగిన పిడకల సమరంలో 45 మందికి పైగా స్వల్పంగా గాయపడ్డారు.