వేసవి రాగానే చాలామందికి ట్రిప్ వేయాలని ఆసక్తి ఉంటుంది. కొందరు వేసవి మొత్తం చల్లదనంగా ఉండాలని ఇతర ప్రదేశాల్లో సంచరిస్తూ ఉంటారు. మరికొందరు కొన్ని రోజులపాటు కొత్త ప్రదేశాలను చూడాలని అనుకుంటారు. అయితే వేసవికాలంలో సముద్రపు ఒడ్డున ఉండాలని కోరుకునే వారు కూడా చాలామంది ఉన్నారు. భారతదేశానికి సముద్రపు తీరం 7516.6 కిలోమీటర్లు. మూడు సముద్రాలు కలిగి ఉన్న భారత్లో 2000 కంటే ఎక్కువే గుర్తింపు కలిగిన బీచ్ లు ఉన్నాయి. అయితే మరికొన్ని చిన్నచిన్న బీచ్ లు కూడా చూడొచ్చు. వీటిలో కొన్ని బీచ్ లు పర్యాటక ప్రదేశాలుగా గుర్తింపు పొందాయి. ఇక్కడికి ఇతర ప్రాంతాల వారు నిత్యం సందర్శిస్తూ ఉంటారు. అయితే వీటిలో వేసవి కాలంలో మాత్రమే అనుకూలంగా ఉండే కొన్ని బీచ్ లు ఉన్నాయి. అవేవో తెలుసుకుందాం..
భారతదేశానికి పశ్చిమాన ఉన్న రాష్ట్రాల్లో గోవా ఒకటి. ఈ రాష్ట్రం అరేబియా సముద్ర తీరాన్ని కలిగి ఉంది. . ఇక్కడ వేసవికాలంలో సముద్రం ప్రశాంతంగా ఉంటుంది. గోవాలో మొత్తం 40 బీచ్ లు ఉన్నట్లు తెలుస్తోంది. వీటిలో కోల్వా బీచ్, అంజునా బీచ్, కలాం గూట్ బీచ్, ఫాలోయింగ్ బీచ్, వాగాటర్ బీచ్, అగుడా బీచ్ వంటివి ప్రసిద్ధి చెందాయి. గోవాను మొత్తం ఉత్తర గోవా, దక్షిణ గోవాను విభజించారు. ఇక్కడికి వెళ్లినవారు వారి సమయానికి అనుకూలంగా వివిధ బీచ్ లను సందర్శించవచ్చు.
భారత్ కు దక్షిణాన తమిళనాడు రాష్ట్రం ఉంది. ఈ రాష్ట్రంలో కన్యాకుమారి బీచ్ అత్యంత ప్రసిద్ధి చెందింది. ఇక్కడికి దేశంలోని వారే కాకుండా విదేశాల నుంచి పర్యాటకులు వస్తారు. ప్రశాంతంగా గడపడానికి ఈ బీచ్ అనుకూలంగా ఉంటుంది. వేసవికాలంలో ఇక్కడ నీరు నీలం రంగులో కనిపిస్తూ నేలా పసుపురంగంలో కనిపిస్తూ ఉంటుంది. తమిళనాడులో కన్యాకుమారి బీచ్ తో పాటు మెరీనా బీచ్, మహాబలిపురం బీచ్ కూడా ప్రసిద్ధి చెందాయి.
కేరళ రాష్ట్రం 590 కిలోమీటర్ల సముద్ర తీరాన్ని కలిగి ఉంది. అరేబియా సముద్ర తీరాన ఉన్న ఈ రాష్ట్రం ఎంతో అందమైన ప్రదేశం. కేరళలో 5 ప్రముఖ బీచ్ లు ఉన్నాయి. వీటిలో కోవలం బీచ్, వర్క్ అలా బీచ్, ముజప్పిలాన్ గార్డ్ బీచ్, చరాయి బీచ్, స్నేహతీరం బీచ్ ప్రముఖమైనవి.. వేసవికాలంలో కేరళలోని కోవలం బీచ్ అనుగుణంగా ఉంటుంది.
కర్ణాటకలోనూ ప్రముఖమైన బీచ్ లు అలరిస్తున్నాయి. ఇక్కడ గోకర్ణ బీచ్ ఆహ్లాదాన్ని ఇస్తుంది. అయితే ఇక్కడ ప్రకృతి రమణనీయంగా కనిపిస్తుంది. అలాగే పుదుచ్చేరి, అండమాన్ నికోబార్ దీవులు, లక్షదీప్ లలో ఉండే బీచ్ లు కూడా వేసవికాలంలో సందర్శించడానికి అనువైన ప్రదేశాలు.