అట్టహాసంగా పారిస్ ఒంలపిక్స్ వేడుకులు ఈరోజే ప్రారంభం కానున్నాయి. ఈసారి ఒలంపిక్స్ లో పాల్గొనేందుకు 10,500 మంది అథ్లెట్స్ పాల్గొననున్నాయి. భారత్ దేశం నుంచి 120 మంది పాల్గొంటారు. ఈ వేడుకలను చాలా వరకు ఫ్రాన్స్ లో కాకుండా పారిస్ నగర శివారుల్లో ఉన్నస్టౌడ్ డి ఫ్రాన్స్ లో జరుగుతాయి. వీటితో పాటు సెంట్రల్ పారిస్ లో 15 వేదికలను ఏర్పాటు చేశారు. అయితే ఈసారి ఫ్రాన్స్ ఒలంపిక్స్ వేడుకల సందర్భంగా నిఘా వర్గాలు ముందే హెచ్చరించాయి. పారిస్ ఒలంపిక్ క్రీడల సందర్భంగా 1.5 కోట్ల మంది ప్రపంచ దేశాల నుంచి వస్తారని అంచనా వేస్తున్నారు. ఈ మేరకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేశారు.
గత నెలలో పారిస్ లోని చార్లెస్ డిగాల్ ఎయిర్ పోర్టులో పేలుడులో రష్యా, ఉక్రెయిన్ జాతీయుడి హస్త ఉన్నట్లు కనుగొన్నారు. దీంతో భద్రతా ముప్పు ఉండే అవకాశం ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రాన్స్ ప్రభుత్వం మొత్తం 45 వేల మందికి పైగా భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేసింది. వీిరలో 18 వేల మంది సైన్యం ఉండగా.. 35 వేల మంది జెండర్మీన్ అనే పారామిలిటరీ దళానికి చెందిన వారున్నారు.

అయితే పారిస్ 2024 ఒలంపిక్స్ క్రీడల్లో పాల్గొనేందుకు రెండు దేశాలకు అనుమతి లేదు. వీటిలో ఒకటి రష్యా , మరొకటి బెలారస్. ఉక్రెయిన్ పై దాడి సందర్భంగా రష్యా తో పాటు రష్యాకు మద్దతు ఇచ్చిన బెలాసర్ కు అనుమతి ఇవ్వలేదు. అయితే వీరు దేశం పేరు చెప్పుుకోకుండా క్రీడల్లో పాల్గొనవచ్చు. అంటే వీరు క్రీడ్లో తమ దేశం పేరు ఎక్కడా ప్రస్తావించద్దనే నిబంధన ఉంచింది. అయితే తమ దేశంపై నిషేధం ప్రకటించినందుకు రష్యా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. దీంతో ఈ ఏడాది సెప్టెంబర్ లో ‘వరల్డ్ ఫ్రెండ్ షిప్ గేమ్స్’ ను నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. 1984లోనూ రష్యా ఒలంపిక్ క్రీడలకు దూరంగా ఉంది.