తెలుగు క్యాలెండర్ ప్రకారం ఉగాది నుంచి కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా కొత్త పంచాంగం కూడా ఇప్పటినుంచే మొదలవుతుంది. కొత్త పంచాంగం ప్రకారం శుభ ముహూర్తాలు, మంచి రోజులు, వివాహాది శుభకార్యాలను నిర్ణయిస్తారు. అందువల్ల ఉగాది రోజున సాయంత్రం పంచాంగ శ్రవణం చేస్తారు. తమ జాతకం కొత్త సంవత్సరంలో ఎలా ఉందో తెలుసుకోవాలని అనుకుంటారు. 2025 మార్చి 30న ఉగాది సందర్భంగా కొత్త ఏడాది ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా ఆయా రంగాల వారి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం…
తెలుగు క్యాలెండర్ ప్రకారం 2025 మార్చి 30 ఆదివారం రేవతి నక్షత్రంలో శ్రీ విశ్వా వసు నామ సంవత్సరం ప్రారంభం కానుంది. ఈ తెలుగు సంవత్సరంలో మేషరాశిలో సూర్యుడు సంక్రమణం చేస్తారు. దీంతో కొన్ని రంగాల వారికి అనుకూలం.. మరికొన్ని రంగాల వారికి ప్రతికూల వాతావరణాలు ఉంటాయి.
‘విశ్వావసు’ అంటే ఏమిటీ? ఈ పేరుకు ఎలాంటి చరిత్ర ఉంది? – insightearth.in – Telugu News Portal
ఈ ఏడాది ఆర్థిక రంగం అంతగా ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవచ్చు. శని ప్రభావం ఎక్కువగా ఉన్న కారణంగా ప్రథమార్థంలో కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. ద్వితీయార్థంలో ఆర్థిక మోసాలు జరిగే అవకాశాలు ఉంటాయి. కానీ ఈ సమయంలో డబ్బు ప్రవాహం ఎక్కువగా ఉంటుంది.
రాజకీయ రంగాల వారికి ఒడిదుడుకులు ఎదురయ్యే అవకాశం ఉంది. పాలకులపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. ఉన్నత పదవుల్లో ఉన్నవారు స్థిరత్వం కోల్పోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొందరు నాయకులు ప్రజా సంక్షేమాన్ని విస్మరించే అవకాశాలున్నాయి..
సూర్యుడు బృహస్పతి గ్రహాల మధ్య అనుకూల దృష్టి ఉండడంతో కార్పోరేట్ రంగం ఏడాది భారీగా విస్తరించనుంది. పెద్ద పెద్ద కంపెనీలు అధిక లాభాలను పొందుతాయి. స్టాక్ మార్కెట్లో కాస్త ఒడిదుడుకులు ఎదుర్కొన్న ఐటీ రంగా మాత్రం ఆర్థికంగా పురోగతి సాధిస్తుంది. ఎగుమతులు పెరిగి ఎక్కువ లాభాలను పొందుతాయి.
వ్యాపారాలు చేసేవారు ఈ ఏడాది ఆశించిన ప్రయోజనాలు అందుకోవడం కష్ట సాధ్యమే. అయితే కొందరు టెక్నాలజీ రంగంలో ఉపాధి ఏర్పాటు చేసుకున్న వారు కాస్త మెరుగైన ఫలితాలు ఉంటాయి. విదేశాలకు వెళ్లాలని అనుకునే వారికి అనుకూల సమయమే. వైద్య రంగం కాస్త బెటర్ అని తెలుస్తుంది. బ్యాంకింగ్ షేర్ మార్కెట్లు మాత్రం పురోగతిని సాధిస్తాయి..
[…] విశ్వావసు సంవత్సరం.. ఈ రంగాల వారికి అన… […]