వర్షాకాలం ప్రారంభం కాగానే మృగశిర కార్తిలో చేపలు తినాలని అంటారు. దీంతో ఈ సమయంలో చేపలకు డిమాండ్ విపరీతంగా పెరుగుతుంది. ఫలితంగా అధికంగా ధరలు కూడా పలుకుతూ ఉంటాయి. మహా అయితే కొన్ని చేపల ధర రూ.1,000 నుంచి 2,000 వరకు ఉంటుంది. కానీ ఓ చేప కిలో ధర ఏకంగా రూ. 35 వేల రూపాయలు పలుకుతోంది. అయితే ఇది కేవలం తినడానికి మాత్రమే కాకుండా ఔషధాలలో వాడే గుణాలు కలిగి ఉంది. అంతేకాకుండా దీనికి విదేశాలలో విపరీతమైన డిమాండ్ ఉంది. ఇంతకీ చేప పేరు ఏంటి? ఇది ఎక్కడ ఎక్కువగా లభిస్తుంది? ఆ వివరాల్లోకి వెళితే..
సముద్రాల్లో అరుదైన చేపలు లభిస్తూ ఉంటాయి. మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళినప్పుడు వింత వింత చేపలు చిక్కుతూ ఉంటాయి. ఒక్కోసారి ఎక్కడా లభించని చేపలు బంగాళాఖాతం సముద్రంలో కనిపిస్తూ ఉంటాయని అంటూ ఉంటార. అలాగే పశ్చిమబెంగాల్ ప్రాంతంలోని సమద్రంలో మత్స్యకారులకు ఏడాదికి రెండు అరుదైన చేపలు చిక్కుతూ ఉంటాయి. ఆ చేప పేరు తెలియ భోలా.. ఈ చేపకు మార్కెట్లో అత్యధిక డిమాండ్ ఉంటుంది. అయితే దీనిని తినడానికి కోసం కాకుండా ఔషధాలలో వాడుతూ ఉంటారు. క్యాప్సుల్ కవర్ వాడడానికి ఈ చేపకు సంబంధించిన కొవ్వును ఉపయోగిస్తారు. అంతేకాకుండా విదేశాల్లో వివిధ అవసరాలకు ఈ చేపను వాడుతుండడంతో దీనికి డిమాండ్ పెరిగిపోయింది.

దీంతో ఈ చేప ధర అధికంగా ధర పలుకుతోంది. 2022లో పశ్చిమబెంగాల్ లో 55 కిలోల తెలియ భోలా చేపకు రూ. 13 లక్షలు వెచ్చించారు. అది కూడా మూడు గంటల పాటు వేలం జరిగిన తరువాత.. చివరికి దానిని విదేశీ కంపెనీ దక్కించుకుంది. అంటే ఈ చేప కిలోకు రూ. 30,000 నుంచి 35000 వెచ్చించినట్టు తెలుస్తోంది. ఫార్మా కంపెనీలు ఈ చేప కోసం ఆరాటపడుతూ ఉంటాయి. ఈ చేప కడుపులో ‘మా’ అనే పదార్థం ఉంటుంది. ఇది బెలూన్ లాగా కనిపిస్తుంది. దీని కోసమే ఈ చేపను కొనుగోలు చేస్తారని చెబుతారు.

ఈ రకమైన జాతి చేపలు ఏడాదికి రెండు మాత్రమే వలలో చిక్కుతూ ఉంటాయి. ఇవి సంతానం కోసం నది తీరాల్లోకి రావడం వల్ల చిక్కుతాయి. ఆ తర్వాత ఇవి సముద్రం అడుగుభాగాన నివసిస్తాయి. అయితే ఈ చేప దక్కిన మత్స్యకారుల పంట పండుతుంది. దీనికోసం నిత్యం మత్స్యకారులు వేట సాగిస్తూ ఉంటారు.