Thursday, June 26, 2025

మహారాష్ట్రలో బీజేపీకి బూస్ట్ ఇచ్చి గెలిపించిన ‘లాడ్లీ బహీన్’పథకం.. ఇది ఎలా ఉందంటే?

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. ఈ రాష్ట్రంలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలున్నాయి. వీటిలో మహాయుతి కూటమి 224 స్థానాల్లో జయకేతనం ఎగరవేసింది. కూటమిలో ఉన్న బీజేపీ 128 , ఏక్ నాథ్ షిండే శివసేన 56, అజిత్ పవార్ ఎన్సీపీ 40 స్థానాల్లో విజయం సాధించారు. మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పడాలంటే 145 స్థానాల్లో విజయం సాధించాలి. కానీ మహాయూతి కూటమి అత్యధిక స్థానాలు గెలుచుకోవడంతో ఈ కూటమి ప్రభుత్వ ఏర్పాటు ఖాయం అన్న చర్చ సాగుతోంది. ఈ కూటమిలో బీజేపీ అత్యధికంగా స్థానాలు తెచ్చుకోవడం గమనార్హం. గత లోక్ సభ ఎన్నికల్లో మహారాష్ట్రలోని 48 స్థానాల్లో పోటీ చేయగా.. కేవలం 18 చోట్ల మాత్రమే గెలిచారు. దీంతో ఈ ఐదు నెలల కాలంలో మహాయుతి కూటమి ఎలా పుంజుకుంది? వీటికి తోడ్పడిన ‘లాడ్లీ బహిన్’ పథకం గురించి వివరాలు ఏంటీ?

సాధారణంగా ఏ ఎన్నికల్లో అయినా ఒకసారి ఓటమి చూసిన తరువాత కొందరు రాజకీయ నాయకులు వాటి నుంచి గుణపాఠం నేర్చుకుంటారు. గత లోక్ సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో బీజేపీ పరాభావం కావడంతో మహాయుతి కూటమి నాయకులు గుణపాఠం నేర్చుకొన్నారు. అందుకే ఇప్పుడు అధికారంలోకి వస్తున్నారు. మహారాష్ట్ర అసెంబ్ల ఎన్నికల్లో మహాయుతి కూటమి విజయం సాధించడానికి అనేక కారణాలు ఉన్నాయి. కానీ వీరికి ఎక్కువగా ఓట్లు తెచ్చింది మాత్రం ‘లాడ్లీ బహీన్’ పథకం అన్న చర్చ ఎక్కువగా సాగుతోంది.

‘లాడ్లీ బహీన్ ’ పథకంను ఇప్పుడు ‘గేమ్ ఛేంజర్’ గా భావిస్తున్నారు. ఈ పథకాన్ని 2024 ఆగస్టులో రక్షాబంధన్ రోజున ప్రారంభిచారు. ముందుగా దీనిని మధ్యప్రదేశ్ లోని శివరాజ్ చౌహన్ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ తరహాలో మహారాష్ట్రలో కూడా అమలు చేస్తామని ఏక్ నాథ్ షిండే హామీ ఇచ్చారు. అయితే ఫైలట్ గా ప్రతి నెలా 30 లక్షల మంది మహిళల ఖాతాల్లో రెండు నెలలకు సంబంధించిన డబ్బులు రూ.3000 చొప్పున జమచేస్తూ వచ్చారు. దీనిని మహాయుతి కూటమి బాగా ప్రచారం చేసుకోవడంతో మహిళల ఓట్లన్నీ వీరివైపే పడ్డట్లు తెలుస్తోంది. మహిళల కోసం ప్రవేశపెట్టే పథకాల్లో ఇది బాగా సక్సెస్ అయిందని కొందరు ఈ కూటమికి చెందిన నాయకులు అంటున్నారు. పథకంలో భాగంగా మహిళలకు నెలకు రూ.15,00 ఆర్థిక సాయం చేయనున్నారు. 21 ఏళ్ల వయసు నుంచి 60 ఏళ్ల వరకు ఉన్న మహిళలందరికీ ఇది వర్తిస్తుంది. అయితే 2.5 లక్షల లోపు ఆదాయం ఉండాలి.

మహాయుతి కూటమి విజయానికి మరో కారణం హిందుత్వ కులాలను ఏకం చేయడం. ‘బంటంగే టు కటేంగే (విడిపోతే పడిపోతాం), ఏక్ రహేందగేతో సేఫ్ రహేంగే( ఒక్కటిగా ఉంటే సురక్షితంగా ఉంటాం) అనే నినాదాలు చేశారు. ఇవి హిందుత్వ ప్రజల్లో బాగా ఆలోచింపజేశాయి. అలాగే ఓబీసీ ఓటర్లను ఒక్కతాటిపైకి చేర్చడంలో కూటమి సఫలమైంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News