Tuesday, June 24, 2025

‘మహేంద్ర సింగ్ ధోని’కి ఆ సమయం వచ్చేసింది..!

క్రికెట్ అంటే ఆట కాదు.. కొందరికి పిచ్చి.. మైదానంలో క్రీడాకారుడు అడుగుపెట్టినప్పటి నుంచి చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగే ఆట క్రికెట్ మాత్రమే. ఇంత క్రేజ్ ఉన్న ఈ క్రీడలో ఉన్నవారికి ఫ్యాన్స్ ఎలా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే వీరిలో కొందరు మాత్రమే ఆకట్టుకున్నారని చెప్పొచ్చు. నాటి కపిల్ దేవ్ నుంచి నేటి విరాట్ కోహ్లి వరకు క్రికెటర్లు తమదైన శైలిలో నైపుణ్య ఆటతీరు ప్రదర్శిస్తూ క్రీడాకారులను అలరిస్తున్నారు. అయితే వీరందరిలో ధోని గురించి ప్రత్యేకంగా చెప్పొచ్చు. 1983 తరువాత మళ్లీ ఇండియాకు 2011లో వరల్డ్ కప్ తెచ్చిన హీరో ఎవరంటే ధోని పేరే చెబుతారు. అలాంటి ధోని ఇండియా క్రికెట్ లో కనిపించకపోయినా.. ఐపీఎల్ లో అతనిని చూసుకొని ఫ్యాన్స్ మురిసిపోయేవారు. కానీ ఇప్పుడు ఐపీఎల్ నుంచి కూడా సిష్క్రమించే సమయం వచ్చిందా?

మహేంద్ర సింగ్ ధోని 1981 జూలై 7న జార్ఖండ్ లోని రాంచిలో జన్మించాడు. కుడిచేతి వాటం కలిగిన ఈ బ్యాటర్ వికెట్ కీపర్ కెరీర్ ప్రారంభించారు. 2004 డిసెంబర్ లో బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో తొలి వన్డే ఆడాడు. ఆ తరువాత 2005లో శ్రీలంకతో జరిగిన టెస్ట్ లో పాల్గొన్నాడు. ఆ తరువాత తన ఆటతీరు ను చూపించి 2007 నుంచి రాహుల్ ద్రావిడ్ నుంచి కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించాడు. తన కెప్టెన్సీ హయాంలో ద్వైపాక్షిక వన్డే సిరీస్ లో భాగంగా శ్రీలంక, న్యూజిలాండ్ తో పోరాడి కప్ ను తీసుకొచ్చాడు. ఆ తరువాత 2007లో ఐసీసీ వరల్డ్ ట్వింట్వీ, 2011 లో వరల్డ్ కప్ తీసుకొచ్చాడు. భారత్ కు 1983 తరువా రెండో కప్ ను తీసుకొచ్చిన ఘనత ధోని మాత్రమే. 2011 ప్రపంచకప్ ఫైనల్ అంటే ఎంతో ఒత్తిడి ఉంటుంది. కానీ ఈ మ్యాచ్ లో ధోని 91 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో 2009లో భారత్ ను ఐసీసీ లోఫస్ట్ ర్యాంక్ లో నిలబెట్టడానికి కారణమయ్యాడు. ధోనీ తన కెరీర్ లో 350 వన్డేలు(10,773 పరుగులు) , 90 టెస్ట్ లు (4,876 పరుగులు), 98 టీ ట్వీంటీ (1,617 పరుగులు) మ్యాచ్ లు ఆడాడు.

ఇండియా క్రికెట్ కు మాత్రమే కాకుండా ఐపీఎల్ కు వన్నె తెచ్చిన క్రికెటర్ గా మహేంద్రసింగ్ ధోని పేరు చెప్పుకోవచ్చు. ఇప్పటికే టీమిండియా నుంచి వైదొలిగిన ఆయన ఐపీఎల్ లో కనిపిస్తుండడండంతో ఫ్యాన్స్ హ్యపీగా ఉన్నారు. కానీ ఇప్పడు ఆయన ఐపీఎల్ నుంచి కూడా తొలిగే అవకాశం ఉంది. మహేంద్ర సింగ్ ధోనికి 42 ఏళ్లు. ఈ వయసులో అందునా టీ 20 క్రికెట్లో కొనసాగడమంటే మామూలు విషయం కాదు. కానీ ఈయన అటు కీపింగ్ లోనూ, ఇటు బ్యాటింగ్ లోనూ ఏ మాత్రం సత్తా తగ్గలేదు. ఏ వేదిక అయినా ధోని లేని చెన్నైని చూడలేమని ఇప్పటికే ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఈ జట్టులో తనదైన ముద్ర వేసి ఐదు సార్లు టైటిల్ తీసుకొచ్చాడు. తమిళ తంబిలకు ధోని అంటే క్రేజీ మాత్రమే కాదు ప్రాణం అని కూడా చెప్పొచ్చు. అలాంటి తమ ఆరాధ్య క్రికెటర్ ఇదే చివరి ఐపిఎల్ అంటే జీర్ణించుకోవడం కష్టమే అనిపిస్తోంది. కానీ ఏ క్రికెటర్ అయినా ఏదో ఒక సమయంలో రిటర్న్ కావాల్సింది ఇప్పుడు మహీకి ఆ సమయం వచ్చేసింది.

తాజాగా ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ లో మహేంద్ర సింగ్ ధోని ఎంతో ప్రయత్నాలు చేసినప్పటికీ పరిస్థితులు అనుకూలించలేదని తెలుస్తోంది. అందునా ఏజ్ ప్రభావం కనిపించింది. గత సీజన్ లోనే మహీంద్రా సింగ్ ధోనీ చివరి ఆట అని అనుకున్నారు.కానీ ఫ్యాన్స్ నుంచి నిరాశ తొలగించేందుకు వచ్చే ఏడాది కూడా ఆడేస్తానని చెప్పాడు. అయితే ఈ ఐపీఎల్ నుంచి ధోని నిష్క్రమిస్తే ఆ తరువాత చెన్నై పరిస్థితి ఏంటో తెలియాలి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News