పవన్ కల్యాణ్ అంటే క్రేజ్ ఉండని వారు ఉండరు. ఒకప్పుడు పవన్ సినిమా అంటే వారం రోజుల ముందు నుంచే సంబరాలు చేసుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకునేవారు. ఆ తరువాత కొన్నాళ్లు గ్యాప్ ఇచ్చి..రీ ఎంట్రీ ఇచ్చిన తరువాత కూడా పవన్ కు ఉన్న ఆదరణ తగ్గలేదు. అయితే ప్రస్తుతం పవన్ రాజకీయాల్లో ఉండడం వల్ల ఆయన సినిమాలపై పెద్దగా ఫోకస్ పెట్టడం లేదు.కానీ పవన్ ఇదివరకు తీసిన సినిమాలు ఇప్పటికీ రీ రిలీజ్ అయినా.. టీవీల్లో వచ్చినా ఎగబడి చూసేవారు ఎందరో ఉన్నారు. అలాంటి సినిమాల్లో ‘తమ్ముడు’ ఒకటి. ఈ సినిమాల్లో పవన్ కు జోడీగి ప్రీతి జింగానియా నటించారు. ఇందులో మరో హీరోయిన్ ‘అదితి గోవికర్’ కూడా నటించారు. ఈ భామ తాజాగా తిరుమలలో ప్రత్యక్షమైంది. ఆమె ఎలా ఉందో చూడండి..
1999లో వేంకటేశ్వర ఆర్ట్ పిలింస్ బ్యానర్ పై బూరుగుపల్లి శివరామకృష్ణ నిర్మాణంలో పీఏ అరుణ్ ప్రసాద్ తీసిన మూవీ ‘తమ్ముడు’. ఇందులో పవన్ కల్యాణ్ హీరోగా నటించారు. ఎమోషనల్, సెంటిమెంట్ తో పాటు ప్యూర్ లవ్లీగా ఉన్న ఈ సినిమా అన్నివర్గాల ప్రేక్షకులనుఆకట్టుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలో కామెడీ ప్రధానంగా నిలుస్తుంది. అయితే ఈ సినిమాలో పవన్ కల్యాణ్ మధ్యతరగతి యువకుడిగా కనిపిస్తాడు. గవర్నమెంట్ కాలేజీలో చదివినా.. కార్పొరేట్ కాలేజీకి చెందిన అమ్మాయిని లవ్ చేయాలనే ఏమ్ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఓ అమ్మాయిని లవ్ లో పడేయడానికి ప్రయత్నిస్తుంటాడు.
అలా ఉన్న అమ్మాయే అదితి గోవికర్. లవ్లీ పాత్రలో నటించిన ఈమె ‘తమ్మడు’ సినిమా తరువాత ‘మౌనమేలనోయి’ సినిమాలో కనిపించింది. ఆ తరువాత బాలీవుడ్ కు వెళ్లిన ఈమె ఆ తరువాత కొన్ని సినిమాల్లో నటించింది. ఆ తరువాత 2021 వరకు హిందీతో పాటు మరాఠీ సినిమాల్లో కూడా కనిపించింది. అయితే అదితి నటించిన సినిమాలు పెద్దగా సక్సెస్ కాకపోవడంతో ఆమెకు గుర్తింపు రాలేదు. దీంతో సినిమాల నుంచి తప్పుకుంది.
అయితే తాజాగా ఈ భామ తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామిని దర్శించుకుంది. కార్తీక పౌర్ణమి సందర్భంగా శుక్రవారం శ్రీవారిని దర్శించుకున్న తరువాత బయట మీడియాతో మాట్లాడింది. ఈ సందర్భంగా ఆమె గుర్తుపట్టకుండా మారిపోవడం చూసి చాలా మంది ఆసక్తిగా కామెంట్ చేస్తున్నారు.